⇒ తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం రూ. 278 కోట్లు
⇒ కొత్తగా 53 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
⇒ 39 రక్త నిధి కేంద్రాల బలోపేతం
హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి రూ. 1105.18 కోట్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పంపిన ప్రతిపాదనలను అంగీకరించింది. ఈ విషయాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది కేంద్రం రూ.792 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 313.16 కోట్లు (28.3%) అదనంగా కేటాయించింది. కేటాయించిన నిధుల్లో తల్లీబిడ్డల ఆరోగ్య కార్యక్రమాలకు రూ. 278.50 కోట్లు, ఆర్బీఎస్కే, 108, 104, ఆసుపత్రుల అభివృద్ధి నిధులు వంటి వాటికోసం రూ. 431.18 కోట్లు కేటాయించింది. ఇమ్యునైజేషన్కు రూ. 28.34 కోట్లు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్కు రూ. 169.54 కోట్లు, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలకు రూ. 76.41 కోట్లు, మౌలిక సదుపాయాలు, నిర్వహణకు రూ. 107.01 కోట్లు కేటాయించింది.
నూతనంగా 53 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారం నూతనంగా 53 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 32 కొత్త మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. 39 రక్తనిధి కేంద్రాలు బలోపేతం చేస్తారు. సేకరించిన రక్తం సరఫరాకు 12 వాహనాలను సమకూర్చుతారు. పీహెచ్సీల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్నిచోట్లా ఉచిత మందులు, పరీక్షలు నిర్వహిస్తారు. శిశుమరణాల రేటు తగ్గించేందుకు 10 కొత్త తల్లి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 14 ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అల్ట్రాసౌండ్ స్కానర్లను ఏర్పాటు చేస్తారు. ఐదు జిల్లాల్లో ఫ్లోరోసిస్ నియంత్రణ సెల్లను ఏర్పాటు చేస్తారు. ఆరు జిల్లాల్లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాలను అమలుచేస్తారు. కాయకల్ప కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం కోసం కార్యక్రమాలు అమలుచేస్తారు.
ఆరోగ్య శాఖకు రూ.1105 కోట్ల కేటాయింపు
Published Sat, Aug 29 2015 8:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement