తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రెండున్నరేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగట్టాలని తెలంగాణ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుకు వివిధ రూపాల్లో ఆందోళన లకు సిద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల్లో పార్టీ నాయకులంతా సరైన పద్ధతిలో స్పందించాలని... ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మలిచేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. రాష్ర్టంలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించాలన్నారు.
జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని, వచ్చేనెల 1 నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదును చేపట్టాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని లేక్వ్యూ అతిథిగృహంలో పార్టీ నేతలు ఎల్.రమణ, రేవంత్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్రెడ్డి, నామా నాగేశ్వరరావు, అరవింద్కుమార్గౌడ్, ఉమా మాధవరెడ్డి, అన్నపూర్ణమ్మ, అమర్నాథ్బాబులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టం, సహాయ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.
రైతాంగానికి వాటిల్లిన నష్టంపై ప్రభుత్వాన్ని నిలదీసి, తగిన పరిహారం వచ్చేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి, హైదరాబాద్లో చేపట్టిన సహాయ కార్యక్రమాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నట్లు తెలిసింది. దసరా తర్వాత నియోజకవర్గానికి 50 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మండల సమన్వయ కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించే అంశం చర్చకు వచ్చింది. ఎన్నిరోజుల పాటు ఈ తరగతులు నిర్వహించాలి, ఏయే అంశాలను చేర్చాలి, వేటిపై శిక్షణ ఇవ్వాలన్న దానిపై మంగళవారం సమావేశమై ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసుకుంటామని చంద్రబాబుకు నేతలు తెలిపారు.
టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టండి
Published Tue, Oct 4 2016 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement