'ఆయనలా చంద్రబాబు పోరాడాలి' | Sakshi
Sakshi News home page

'ఆయనలా చంద్రబాబు పోరాడాలి'

Published Fri, Aug 28 2015 3:32 PM

'ఆయనలా చంద్రబాబు పోరాడాలి' - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ లా పోరాడాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రానికి  అన్ని రాయితీలు, పరిశ్రమలు వస్తాయని చెప్పారు.

ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో మార్మోగుతున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీతో సరిపెట్టాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రేపటి బంద్ ను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Advertisement
Advertisement