ప్రయాణికుడి అదృశ్యంపై అనుమానాలు | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి అదృశ్యంపై అనుమానాలు

Published Tue, Apr 1 2014 9:55 AM

Chennai express robbery: police Suspects missing passenger!

హైదరాబాద్ : చెన్నై-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ దోపిడీ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దోపిడీ అనంతరం ఎస్-11 కోచ్లోని 24 నెంబరు సీటు ప్రయాణికుడు అదృశ్యమయ్యాడు. దాంతో పోలీసులు అతడి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్క పథకం ప్రకారమే ఈ దోడిపీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

అదృశ్యమైన ప్రయాణికుడి వివరాలుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దోపిడీలో పదిమంది పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా యువకులే కాగా ముఖాలకు మాస్క్ లు ధరించి దోపీడి చేశారు.  కాగా ఈ దోపిడీ ఘటనపై తొమ్మిది మంది ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement