వర్షాల వల్ల ప్రాణనష్టంపై కేసీఆర్ దిగ్భ్రాంతి | Sakshi
Sakshi News home page

వర్షాల వల్ల ప్రాణనష్టంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Published Wed, Aug 31 2016 2:28 PM

వర్షాల వల్ల ప్రాణనష్టంపై కేసీఆర్ దిగ్భ్రాంతి - Sakshi

జంట నగరాలలో బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.

Advertisement
Advertisement