హైదరాబాద్:
సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న ఓ ప్రబుద్ధుడు వీవీఐపీల పేర్లు చెప్పి అనేక మంది ప్రముఖుల్ని ‘ఇష్టం వచ్చినట్లు వాడేశాడు’. ఉద్యోగాలకు పైరవీ నుంచి సినిమా టిక్కెట్ల వరకు ‘వినియోగించుకున్నాడు’. ఇద్దరు నిరుద్యోగులకు ఢిల్లీలో ఉద్యోగాల పేరుతో భారీగా దండుకున్నాడు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వంగ ఆనంద్బాబు నగరానికి వచ్చి ఫిల్మ్నగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న ఇతగాడు.. తన స్వస్థలానికి వెళ్లినప్పుడల్లా పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ డాంబికాలకు పోయేవాడు.
కొన్నాళ్లకు ‘ఈ పరిచయాలనే’ క్యాష్ చేసుకోవాలని భావించాడు. తన స్నేహితురాలి పేరుతో ఓ సిమ్కార్డు తీసుకున్న ఆనంద్బాబు వెబ్సైట్లు, డైరెక్టరీల ఆధారంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు, వారి హోదాలు తెలుసుకున్నాడు. వారి మాదిరిగానే ప్రముఖులకు ఫోన్లు చేయడం, మెసేజ్లు పంపించడం మొదలెట్టాడు. ఉద్యోగాలకు సిఫార్సులు, పోస్టింగ్స్తో పాటు తిరుమలలో దర్శనాలు, అనేక ప్రాంతాల్లో బసలు ఆ ప్రముఖులతోనే ఏర్పాటు చేయించుకున్నాడు. చివరకు కొందరు అధికారులకు సదరు ప్రముఖుడిగా ఫోన్లు చేసి తన వాళ్ళు వస్తున్నారంటూ సినిమా టిక్కెట్లు సైతం సిద్ధం చేయించుకుని తన స్నేహితురాలితో కలిసి వెళ్ళేవాడు.
ఆనంద్బాబు ఇప్పటి వరకు ప్రధానమంత్రి కార్యాలయం అదనపు సెక్రటరీ ఏకే శర్మ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తదితర పేర్లు వాడుకున్నాడు. ఈ పేర్లతో వివిధ జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరెంటెండెంట్లతో పాటు ఉన్నతాధికారులనూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇద్దరు నిరుద్యోగులకు ఢిల్లీలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నతోద్యోగాలు ఇప్పిస్తాంనంటూ భారీగా దండుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందింది. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ బి.చాంద్బాష, ఎస్సై బి.మధుసూదన్ వలపన్ని అరెస్టు చేశారు. ఇతగాడి మోసాలను పూర్తిస్థాయిలో గుర్తించడానికి న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులు నిర్ణయించారు.
వీవీఐపీలు తెలుసంటూ కో ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే..
Published Wed, Feb 22 2017 5:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement