గవర్నర్కు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
⇒ రాజ్భవన్లో గంటన్నర సేపు భేటీ
⇒ ఏపీ సచివాలయం అప్పగింత తదితరాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న భవనాలు, కార్యాలయాల పంపిణీని వేగంగా పూర్తి చేయా లని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు సీఎం కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి రాజ్భవన్కు వెళ్లిన సీఎం గంటన్నరకు పైగా గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. రెండు రోజులపాటు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సీఎం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
వచ్చీ రాగానే గవర్నర్తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ సచివాలయ భవనాల అప్పగింత, విభజన వివాదాల పరిష్కా రానికి రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీల విధివిధానాలు, బడ్జెట్ సమావేశాలు, కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసిన అంశాలపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. గవర్నర్ సారథ్యంలో రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు ఇప్పటికే రెండుసార్లు సమావేశమ య్యాయి. సచివాలయం లోని ఏపీ భవనాలను అప్ప గించాలని కోరుతూ తెలం గాణ ప్రభుత్వం తీర్మానం చేసి రెండు నెలల కిందటే గవర్నర్కు పంపించింది. భవనాలను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ బదులుగా తమకు లేక్వ్యూ గెస్ట్హౌస్తోపాటు ఖాళీ స్థలాన్ని కేటాయించా లనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
అయితే త్రిసభ్య కమిటీ రెండు దఫా లుగా జరిపిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత రాలేదు. తమ ముఖ్యమంత్రితో మాట్లాడి చెబు తామంటూ మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు సార థ్యంలోని త్రిసభ్య కమిటీ ఈ అంశాన్ని పెండిం గ్లో పెట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ మహి ళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లిన గవర్నర్.. ఏపీ సీఎం చంద్రబాబుతో ఈ అంశాన్ని చర్చించినట్లు తెలిసింది. మరుసటి రోజునే సీఎం కేసీఆర్ గవర్నర్తో భేటీ కావడంతో భవనాల అప్పగింతపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.
మార్చి మొదటి లేదా రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు..
రాబోయే బడ్జెట్ సమావేశాలపై గవర్నర్తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చర్చించి నట్లు తెలిసింది. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.
వేగంగా ‘భవనాల’ పంపిణీ
Published Mon, Feb 13 2017 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement