రూ.కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్ఐ) ఆస్పత్రులలో కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఈఎస్ఐ డిస్పెన్సరీ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యంతో పాటు కాగితరహిత కార్యకలాపాల కోసం రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో అధికశాతం నాలుగేళ్లుగా పని చేయకపోయినా పట్టించుకునేవారే లేరు. వీటి నిర్వహణ బాధ్యతను తీసుకున్న విప్రో సంస్థ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు నాణ్యమైన వైద్యసేవలు పొందలేకపోతున్నారు. 2012లో రాష్ట్రంలోని 70డిస్పెన్సరీలు, 8 డయాగ్నోస్టిక్ సెంటర్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ కోసం విప్రోకు కాంట్రాక్టు ఇచ్చారు. కానీ నిర్వహణలో చిత్తశుద్ధి కొరవడంతో కేవలం 32 డిస్పెన్సరీలలో మాత్రమే కంప్యూటర్లు తూతూ మంత్రంగా పనిచేస్తున్నాయి.
అరకొరగా ఇంటర్నెట్...
చాలా చోట్ల డిస్పెన్సరీలకు ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదు. కొన్ని చోట్ల లైన్లు వేసి నా అతితక్కువ సామర్థ్యంతోనే ఏర్పాటు చేశారు. సనత్నగర్లో ఉన్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రికీ 1ఎంబీ మాత్రమే ఇచ్చారు. దీనివల్ల డిస్పెన్సరీలకు వచ్చే రోగుల వివరా లు ఆన్లైన్లో నమోదు చేయడం కష్టంగా మారింది. ఒక్కొక్కరి వివరాలు నమోదు చేయడానికి చాలా సమయం పడుతుండటం తో పేషెంట్లు ఆందోళన చేస్తున్నారు. దాంతో అధికారులు ఆన్లైన్ విధానానికి స్వస్తి పలికి యధావిధిగా రిజిస్టర్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కార్డుదారులు కోరుతున్నారు.
ఈఎస్ఐల్లో పనికిరాని కంప్యూటర్లు
Published Wed, Sep 14 2016 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement