పేదల కోసం వైఎస్‌ఆర్‌ ప్రారంభించారు | Sakshi
Sakshi News home page

పేదల కోసం వైఎస్‌ఆర్‌ ప్రారంభించారు

Published Fri, Dec 16 2016 11:19 AM

పేదల కోసం వైఎస్‌ఆర్‌ ప్రారంభించారు - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని పరిగి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రశ‍్నోత్తరాల సమయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై చర్చ జరిగింది. సభలో రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకానికి తగినన్ని నిధులు లేవని, చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌​లోని గాంధీ ఆస్పత్రిలో ఆరేళ్ల పాపకు పురుగులున్న సెలైన్‌ బాటిల్‌ ఎక్కించిన సంఘటనను రామ్మోహన్‌ రెడ్డి సభలో ప్రస్తావించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పాప పరిస్థితి విషమంగా మారిందని, పేదల ఆరోగ‍్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవేనా అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement