ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయండి | Sakshi
Sakshi News home page

ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయండి

Published Wed, Aug 3 2016 1:34 AM

ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయండి - Sakshi

కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలని పేర్కొన్నారు. హైకోర్టు కోసం తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు ఆందోళనలో ఉన్నారు. ఏపీలో కూడా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం అమరావతిలో హైకోర్టుకు భవనాలు ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా లేదు.

అక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దెబ్బతీస్తున్నారు. గత మూడు నెలలుగా తెలంగాణలో న్యాయవ్యవస్థ స్తంభించిపోయింది. న్యాయాధికారులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో వారు సస్పెన్షన్‌కు గురయ్యారు. సమస్య మరింత పెరిగిపోయింది. అందువల్ల త్వరితగతిన హైకోర్టు ఏర్పాటుచే యాలి’ అని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement