వివాహం పేరుతో రాజస్థాన్ ముఠా టోకరా
ఓ నిందితుడిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో పంజా విసిరే సైబర్ నేరగాళ్లు చివరకు హెచ్ఐవీ బాధితులనూ వదలకుండా ఆన్లైన్లో వలవేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ రోగి నుంచి రూ.16 లక్షల కాజేసిన రాజస్థాన్ ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం నలుగురిలో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ గురువారం తెలిపారు. నగరంలోని పద్మారావునగర్కు చెందిన హెచ్ఐవీ సోకిన వ్యక్తి తన భార్య, పిల్లలు వదిలేసి వెళ్లిపోయారు. మరో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ‘పాజిటివ్షాదీ.కామ్’ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని, తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. అప్పుడు శివానీ శర్మ నుంచి తన ప్రొఫైల్కు లైక్ వచ్చింది.
సోదరుడు రోహిత్ శర్మ రంగప్రవేశం చేశాడు. సోదరితో మాట్లాడిస్తూనే వివాహం తర్వాత తమ వద్దకే రావాలని హైదరాబాద్లో అతనికి గల ఆస్తిపాస్తులు విక్రయించుకు రావాలని కోరారు. బాధితుడు పద్మారావునగర్లో ఉన్న ఇంటిని రూ.16 లక్షలకు విక్రయించాడు. ఈలోపు ఆ నగదు తమ ఖాతాలో జమచేసి, ఢిల్లీకి రావాలని కోరారు. బాధితుడు అలాగే చేయడంతో ఆ నగదును ముఠా స్వాహా చేసింది. ఆ తర్వాత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో వెబ్సైట్ నుంచి ప్రొఫైల్ తీసేయాలని అతణ్ని కోరారు. తనకు ఎలా తొలగించాలో తెలియదనడంతో ముఠా సభ్యులే ప్రొఫైల్ డిలీట్ చేశారు. ఆపై సంప్రదింపులు పూర్తిగా మానేయడంతో పాటు ఫోన్ చేస్తే బెదిరించడం మొదలెట్టారు.
దాంతో బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా అది రాజస్థాన్లోని కుమ్హార్ ప్రాంతానికి చెందినదని తెలుసుకుని అక్కడకు వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో సీసీఎస్ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ విభాగం ఏసీపీ డాక్టర్ బి.అనురాధ సిబ్బందితో సాంకేతికంగా దర్యాప్తు చేయించారు. ఎట్టకేలకు నిందితులను గుర్తించిన ఇన్స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం కుమ్హార్ వెళ్లి అవధేష్ లవణ్య అనే నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ మోసానికి అతడి సోదరి సీమ సూత్రధారని తేలింది. ఆమె పథకం ప్రకారం తనను రోహిత్ శర్మగా, మరో సోదరుడైన అనిత్ లవణ్యను బంధువుగా, ఇతడి భార్య సుమన్ను శివానీ శర్మగా బాధితుడికి ఫోనులో పరిచయం చేసి మోసం చేసినట్లు వెల్లడించాడు. అవధేష్ను నగరానికి తీసుకువచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన వారిని పట్టుకోవడంతో పాటు నగదు రికవరీకీ ప్రయత్నాలు ప్రారంభించారు.
హెచ్ఐవీ బాధితుడినీ వదల్లేదు!
Published Fri, Oct 9 2015 3:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement