♦ ఏప్రిల్ 1న అందుకోనున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
♦ జూలై నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జీపీఎఫ్లో జమ
♦ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతంతో పెరిగిన కరువు భత్యం (డీఏ) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏప్రిల్ 1న ఇచ్చే జీతంతో ఈ పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది. ఉద్యోగులకు గతేడాది జూలై నుంచి పెరిగిన డీఏ చెల్లించాల్సి ఉంది. అప్పట్నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది. పెరిగిన డీఏ చెల్లింపులకు సంబంధించిన ఫైలును ఈ నెల 7న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. 3.144 శాతం డీఏ పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కానీ నారాయణఖేడ్ ఉప ఎన్నిక కోడ్ అమల్లో ఉండటంతో ఫైలును పెండింగ్లో ఉంచింది.
ఇటీవలే ఆర్థిక శాఖకు చేరిన ఈ ఫైలు అధికారుల పరిశీలనలో ఉంది. మార్చి 1న ఇచ్చే జీతాలకు సంబంధించిన బిల్లులన్నీ ఈ నెల 20 వరకే సిద్ధమయ్యాయి. కానీ అప్పటికీ ఫైలుకు క్లియరెన్స్ రాకపోవటంతో ఉత్తర్వుల జారీ నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులు నిరాశపడ్డారు. దీంతో వచ్చేనెల నుంచి పెరిగిన డీఏ వర్తింపజేసేందుకు వీలుగా మరో వారం పది రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన డీఏ చెల్లింపులకు ప్రతి నెలా రూ.80 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జూలై నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.640 కోట్ల డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు పెరిగిన డీఏ తరహాలోనే పెన్షనర్లకు కరువు భృతి(డీఆర్)ని చెల్లించాల్సి ఉంది. ఈ రెండు జీవోలను వేర్వేరుగా జారీ చేయనున్నారు. పెన్షనర్లకు, కొత్తగా చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేకపోవటంతో డీఏ బకాయిలను వీరికి నగదు రూపంలోనే చెల్లించనున్నారు.
మార్చి జీతంలో పెరిగిన డీఏ
Published Mon, Feb 29 2016 3:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement