రైతుల నగదు కష్టాలపై 14న ధర్నా: ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

రైతుల నగదు కష్టాలపై 14న ధర్నా: ఉత్తమ్‌

Published Thu, Jul 13 2017 12:58 AM

రైతుల నగదు కష్టాలపై 14న ధర్నా: ఉత్తమ్‌ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పడుతున్న నగదు కష్టా లపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు కాం గ్రెస్‌ ఆందోళనలకు నడుంకడుతోందని పీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

రైతుల రుణమాఫీ, వడ్డీ బాధలు, ఉపాధి హామీ కూలీల నగ దు కష్టాలపై పాత జిల్లా కేంద్రాల్లోని బ్యాం కుల ఎదుట 14న ధర్నాలు చేపడతామని చెప్పారు. రైతుల డబ్బు బ్యాంకుల్లో ఉన్నా సకాలంలో ఇవ్వ కపోవడంతో వారు అవస్థలు పడుతున్నారన్నారు. వారి అవస రాలకు తగినన్ని డబ్బులను బ్యాంకులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ నాలుగో విడత నిధులు తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు

Advertisement

తప్పక చదవండి

Advertisement