అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో దిగ్విజయ్సింగ్
వారిని ఓటు బ్యాంకుగా చూడకూడదని వ్యాఖ్య
కేసీఆర్.. దళిత సీఎం సంగతేంది?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు తొలి నుంచీ అండగా ఉంటున్న దళితుల విశ్వాసం పొందకపోతే ఇక ముందు కష్టమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను టీపీసీసీ మంగళవారం హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా దిగ్విజయ్సింగ్ మాట్లాడారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పరితపించిన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయం జరిగిందని చెప్పారు. దళితులను ఓటు బ్యాంకుగా చూడకూడదన్నారు. దళితవాడలకు వెళ్లాలని, వారితో చర్చలు జరపాలని, వారితో కలసి తిరుగుతూ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్లో బెల్లయ్య నాయక్ చేరిక
లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్య రాజకీయాలకు వేదిక అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దళిత సీఎం మాటేమైంది?: ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని కేసీఆర్ ఇచ్చిన మాట ఏమైందని ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక కొనడానికి భూమి దొరకడం లేదనడం దళితులను మోసం చేయడం కాదాని నిలదీశారు. దళితులపై కేసీఆర్ బూటకపు ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు మనుస్మృతి ఇరానీగా మారిపోయారని ఎస్.జైపాల్రెడ్డి విమర్శించారు. సమాజానికి ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాల్సిన యూనివర్సిటీలను ఏబీవీపీకి అడ్డాగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఎలుగెత్తి చాటిన మహా మేధావి అంబేడ్కర్ను కేవలం దళితులకే నాయకుడనే ధోరణితో కొందరు చూడటం బాధాకరమని కొప్పుల రాజు వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ పోరాట ఫలితమే దళితులకు దక్కుతున్న అవకాశాలని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి అన్నారు. బాంచెన్ బతుకుల వివక్ష నిర్మూలనకు అంబేడ్కర్ జీవితాంతం కృషి చేశారని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. అట్టడుగు వర్గాలకు అధికారం అంబేడ్కర్ పుణ్యమేనని షబ్బీర్ అలీ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాజాన్ని కలుషితం చేస్తోందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. కుల రహిత, స్త్రీ-పురుష సమానత్వం కోసం చివరివరకూ పోరాడిన మహానేత అంబేడ్కర్ అని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు సర్వే సత్యనారాయణ, వివిధ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దళితుల విశ్వాసం పొందకుంటే కష్టమే: దిగ్విజయ్
Published Wed, Apr 13 2016 3:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement