డ్రంక్ అండ్ డ్రైవ్.. 30 మందిపై కేసు | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్.. 30 మందిపై కేసు

Published Fri, Jun 12 2015 8:38 PM

drunk and drive case on 30 members

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి  2 కార్లు,  3 ఆటోలు, 25 ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. ఒక ఆటో డ్రైవర్‌కు రూ.2 వేల జరిమానాతో పాటుగా 3 రోజుల జైలు శిక్ష పడిందని, 19మందికి వెయ్యి రూపాయల జరిమానాను కోర్టు విధించిందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement