♦ పెలైట్ ప్రాజెక్టు కింద వరంగల్ జిల్లాలో ప్రారంభం
♦ అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి కడియం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో 400 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను పెలైట్ ప్రాజెక్టు కింద ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో వరంగల్ జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య సమావేశమయ్యారు. అలాగే ఇంగ్లిష్ మీడియం పాఠశాలల ఏర్పాటులో భాగంగా 2,500 మంది టీచర్లకు శిక్షణ ఇస్తున్న అంశంపైనా సమీక్షించారు.
ఈ శిక్షణను నిర్వహిస్తున్న ఆంగ్ల భాషోపాధ్యాయ సంఘాన్ని (ఎల్టా) ఈ సందర్భంగా అభినందించారు. కాగా, వరంగల్ జిల్లాలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభానికి జిల్లా కలెక్టర్ కరుణ చేసిన ప్రతిపాదనలపై తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కడియం రంజీవ్ ఆర్. ఆచార్యను, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, డీఈవో రాజీవ్, ఎల్టా వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, ఎల్టా అధ్యక్ష, కార్యదర్శులు పూల శ్రీనివాస్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాల వారీగా సమీక్షలు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లాల వారీ గా విద్యాశాఖపై సమీక్షలను ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్, వరంగల్ జిల్లాలో విద్యా కార్యక్రమాలపై సమావేశాలు నిర్వహించా రు. త్వరలో మిగతా జిల్లాల్లో విద్యా కార్యక్రమాలపైనా సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేషనలైజేషన్పై ఏం చేద్దాం?
రాష్ట్రంలో పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. విద్యార్థుల్లేని పాఠశాలలను మూసివేయాలా? ప్రత్యామ్నాయ విధానాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలన జరుపుతోంది. సోమవారం కడియం శ్రీహరి నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మొదట ఒక జిల్లాలో హేతుబద్ధీకరణ చేపట్టి, ఆ తరువాత అన్ని జిల్లాల్లో హేతుబద్ధీకరణ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఈసారికి ప్రైవేటు పుస్తకాలే!
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పుస్తకాలు కాకుండా ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించిన పాఠ్య పుస్తకాలనే కొనసాగించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నందున ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది.
400 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం
Published Tue, May 17 2016 3:37 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
మాయావతి పార్టీ మరో లిస్ట్..
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఆ ఓటర్లే కీలకం..!
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement