పోలీసులకు ఓ తండ్రి వేడుకోలు.. కొడుకులపై ఫిర్యాదు
హైదరాబాద్: తన కొడుకులు కూడు పెట్టడంలేదని ఓ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి మూడు పూటలా అన్నం పెట్టేలా చూడాలని వేడుకున్నాడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బోరబండకు చెందిన అంజయ్యగౌడ్(75) గతంలో పిండిగిర్నీ పెట్టుకుని జీవనం సాగించేవాడు.
నలుగురు కొడుకులను పెంచి పెళ్లిళ్లు చేయగా.. అందరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవటంతో మూడో కుమారుడు మహేశ్ వద్ద ఉంటున్నాడు. అతను సరిగ్గా పట్టించుకోక పోవడంతో ఉప్పల్లో ఉండే పెద్ద కొడుకు శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి ఎదురు కావడంతో.. మిగతా ఇద్దరు కొడుకుల వద్దకు వెళ్లాడు. వారు సరిగా పట్టించుకోలేదు. కనీసం భోజనం కూడా పెట్టకపోవడంతో చేసేదేమీలేక స్టేషన్కు వచ్చి కొడుకులపై ఫిర్యాదు చేశాడు. నలుగురిని పిలిపించి నచ్చచెప్పి మూడు పూటల భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అంజయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు నలుగురు కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, లేని పక్షంలో వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
తిండైనా పెట్టేలా చూడండి
Published Thu, Jan 5 2017 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement