- ఈనెల 21 వరకు పొడిగించిన ప్రభుత్వం
- గడువులోగా దరఖాస్తు చేసిన ఒంటరి మహిళలకే జూన్ 2న ఆర్థిక భృతి
- ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 1.20 లక్షలే
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 21 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక భృతి పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి 13 వరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాలు, గ్రామ సభల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డు కార్యాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయితే గడువులోగా ప్రభుత్వం ఊహించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో, దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును 21 వరకు పొడిగించారు.
ఏ ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.2 వేలను) రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే జూన్ 2న ఆర్థిక భృతిని చెల్లించనున్నారు. గడువు దాటాక వచ్చిన దరఖాస్తులకు జూన్ నెల నుంచి ఆర్థిక భృతిని వర్తింపజేయాలని నిర్ణయించారు.
అందిన దరఖాస్తులు 1.20 లక్షలే
రాష్ట్రంలో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా శనివారం వరకు 1,20,484 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భర్త వదిలేసిన మహిళలు, భర్తకు దూరంగా ఉంటున్న మహిళలు.. ఇప్పటికే వితంతు కేటగిరీలో ఆసరా పింఛన్ పొందుతున్నారని, ఈ కారణంగానే ఒంటరి మహిళల కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
సెర్ప్ అధికారులకు అందిన మొత్తం దరఖాస్తుల్లో ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే అత్యధికంగా 10,313 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అలాగే ఆసరా పెన్షనరు ఉన్న కుటుంబంలోని బీడీ కార్మికులకు కూడా ఆర్థిక భృతిని ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, బీడీ కార్మికుల నుంచి సుమారు 80 వేల నుంచి 1 లక్ష దరఖాస్తులు రావచ్చని అంచనా వేసింది. అయితే చాలా తక్కువగా కేవలం 15,603 దరఖాస్తులు మాత్రమే అందాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా నుంచి 5,227, కామారెడ్డి జిల్లా నుంచి 3,567 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 31 జిల్లాల్లో 15 జిల్లాల నుంచి ఒక్క దరఖాస్తు కూడా అందకపోవడం గమనార్హం.
ఆర్థిక భృతి దరఖాస్తు గడువు పెంపు
Published Sun, May 14 2017 2:29 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement