►నిర్లక్ష్యం వీడని గాంధీ ఆస్పత్రి సిబ్బంది
►ఎమ్మెల్యే సతీమణికి సైతం ఇబ్బందులే..
►స్వయంగా వీల్చైర్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి..
గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం..బాధ్యతారాహిత్యం కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణి సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలిలా ఉన్నాయి.. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత నరాల బలహీనతతో బాధపడుతున్న తన అక్క కుమారుడు భాస్కర్రెడ్డిని మంగళవారం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగానికి వెళ్లాల్సిన వీరు..అవుట్ పేషెంట్ విభాగానికి వెళ్లి అక్కడ ఉన్న వీల్చైర్పై రోగి భాస్కర్రెడ్డిని కూర్చోబెట్టారు. అక్కడ సిబ్బంది ఎవ్వరూ కన్పించకపోవడంతో కొంతసేపు వేచి చూశారు. ఫలితం లేకపోవడంతో సుజాత స్వయంగా వీల్చైర్ను నెట్టుకుంటూ ఓపీ విభాగం లోపలికి వెళ్లారు. అయితే వెళ్లాల్సింది అత్యవసర విభాగానికని తెలుసుకుని అక్కడి నుంచి ఎమర్జెన్సీ విభాగం వద్దకు కూడా వీల్ఛైర్ను నెట్టుకుంటూ వెళ్లారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు స్పందించి...రోగిని అత్యవసర విభాగంలో అడ్మిట్ చేసి వైద్యసేవలు అందించారు. అనంతరం ఇన్పేషెంట్ విభాగం నాల్గవ అంతస్తులోని వార్డుకు తరలించారు.
సమన్వయం లోపం వల్లే...
సమన్వయం లోపంతో ఈ ఘటన జరిగినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్కుమార్ మీడియాకు వివరించారు. రోగిని తీసుకువస్తున్న విషయంపై తనకు ముందే సమాచారం ఉందని, నేరుగా ఎమర్జెన్సీ విభాగం వద్దకు రమ్మని చెప్పి, అక్కడ ఇద్దరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని, అయితే రోగిని తీసుకుని ఓపీ విభాగం వద్దకు వెళ్లడంతో సమస్య ఉత్పన్నం అయిందన్నారు. గాంధీ ఆస్పత్రి సిబ్బంది పనితీరు గతం కంటే ఎంతో మెరుగుపడిందని, ఎమర్జెన్సీ విభాగం వద్ద ఆరుగురు సిబ్బందిని వీల్ఛైర్లు, స్ట్రెచర్లతో నిరంతరం అందుబాటులో ఉంచామని శ్రవణ్కుమార్ స్పష్టం చేశారు.
రోగిని వీల్ చైర్పై తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత
‘గాంధీ’లో అంతే!
Published Wed, May 31 2017 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement