ఆకట్టుకున్న ‘గాంధీ మార్గం’ | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘గాంధీ మార్గం’

Published Sun, Dec 7 2014 12:12 AM

ఆకట్టుకున్న ‘గాంధీ మార్గం’

వనస్థలిపురంలో చెరుకూరి గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామారావు ఆధ్వర్యంలో శనివారం ‘సాయిదేశం-గాంధీమార్గం’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు, గాంధేయవాది అన్నా హజారే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సాహెబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన హజారే ఛత్రపతి శివాజీ మైదానంలో జరిగిన సభలో ప్రసంగించి ఆహూతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో సంఘ సేవకులు రంగయ్యగౌడ్, సంజయ్‌కుమార్, డాక్టర్ సురేష్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 - ఎల్‌బీనగర్/తుర్కయంజాల్
 
 

Advertisement
Advertisement