అందరినీ ఆకర్షిస్తోన్న గణేష్ మంటపం | Sakshi
Sakshi News home page

అందరినీ ఆకర్షిస్తోన్న గణేష్ మంటపం

Published Wed, Sep 16 2015 5:27 PM

అందరినీ ఆకర్షిస్తోన్న గణేష్ మంటపం

వనస్థలిపురం: వనస్థలిపురం రామాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బద్రినాథ్ దేవాలయం నమూనాలోని గణేష్ మంటపం అందరినీ ఆకర్షిస్తోంది. కోల్‌కతాకు చెందిన కళాకారులు నెల రోజులపాటు శ్రమించి చార్‌ధాంలోని బద్రీనాథ్ దేవాలయం మాదిరిగా మంటపాన్ని తీర్చిదిద్దారని ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్ చైర్మన్ చింతల రవికుమార్ తెలిపారు. ఈ మంటపం నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చయినట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement