గ్రేటర్లో ఇక ఇంటింటికీ ఎల్ఈడీ వెలుగులు!
►విద్యుత్ ఆదా... పర్యావరణ హితమే లక్ష్యం
►కార్యాచరణకు సిద్ధమైన జీహెచ్ఎంసీ
►ఎస్హెచ్జీల సహకారంతో సబ్సిడీపై విక్రయాలు
సిటీబ్యూరో: విద్యుత్ ఆదా...పర్యావరణ హితమే లక్ష్యంగా గ్రేటర్ పరిధిలో ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల కుటుంబాలకు ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్లైట్లు విక్రయించిన జీహెచ్ఎంసీ..ఇక నుంచి స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా సబ్సిడీపై ఎల్ఈడీ బల్బుల విక్రయాలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా భారీగా విద్యుత్ ఆదా కావడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల 20 నుంచి 75 శాతం వరకు విద్యుత్ ఆదా అయి...బిల్లులు భారీగా తగ్గుతాయని చెబుతున్నారు. సాధారణ బల్బులు, ట్యూబ్లైట్ల కంటే ఎల్ఈడీలు ఎంతో మేలని పేర్కొన్నారు.
ఉజాలా పథకం కింద...
గ్రేటర్ నగరంలోని అన్ని నివాస గృహాల్లో ఎల్ఈడీ బల్బులను వినియోగించేందుకు స్వయం సహాయక మహిళాసంఘాల (ఎస్హెచ్జీ) సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరంలోని 22 లక్షలకుపైగా గృహాలన్నింటికీ వీటిని విక్రయించేందుకు ఎస్హెచ్జీల్లోని సామాజిక కార్యకర్తల సేవల్ని వినియోగించుకోనున్నారు. విద్యుత్ను ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉజాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈఈఎస్ఎల్ నుండి సబ్సిడీ రేట్లకు కొనుగోలు చేసి, ప్రతి ఇంటికి వీటిని విక్రయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి నిర్ణయించారు. నగరంలో జీహెచ్ఎంసీ సహకారంతో ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎల్ఈడీ విక్రయ కేంద్రాల ద్వారా ఇప్పటికే 9 వాట్ల సామర్ధ్యం గల 2,17,000 ఎల్ఈడీ బల్బులు, 20 వాట్ల సామర్ధ్యం కలిగిన ట్యూబ్ లైట్లు 50 వేలు, 8750 ఫ్యాన్లు విక్రయించారు. దాదాపు రెండు లక్షల గృహాల వారు వీటిని కొనుగోలు చేశారు. మిగతా 20 లక్షల గృహాలకు కూడా వీటిని విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకుగాను ఎస్హెచ్జీల్లోని సామాజిక కార్యకర్తల సేవలు వినియోగించుకోనున్నారు.
విద్యుత్ ఆదా..పర్యావరణ హితం ఇలా..
ఉదాహరణకు ప్రస్తుతం ఒక్కో ఇంటికి మూడు ఫ్లొరోసెంట్ ట్యూబ్ లైట్లు ఉపయోగించడం ద్వారా దాదాపు 23.33 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. వీటి స్థానంలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్లను ఉపయోగిస్తే కేవలం 9.72 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది. అంటే దాదాపు 13.61 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఎల్ఈడీ బల్బుల వినియోగం ద్వారా నెలకు 12 నుంచి 20 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా విద్యుత్ చార్జీల స్లాబ్రేట్లు గణనీయంగా తగ్గుతాయి. ప్లోరోసెంట్, సాంప్రదాయక విద్యుత్ బల్బులతో పోల్చిచూస్తే ఎల్ఈడీలు వాటికన్నా ఐదురెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో పాటు కార్బన్డయాక్సైడ్ను అతి తక్కువ స్థాయిలో విడుదల చేస్తాయి. కాగా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల ద్వారా రెండు లక్షలకు పైగా బల్బులు విక్రయించారు.
ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తుండటంతో దీన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్హెచ్జీల్లోని సామాజిక కార్యకర్తల సేవల్ని వినియోగించుకోనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఇక ఉజాల కార్యక్రమంలో భాగంగా ఒక్కో ఎల్ఈడీ బల్బు 70 రూపాయలు, ట్యూబ్ లైట్ 230 రూపాయలు, ఫ్యాన్ 1,150 రూపాయలకు విక్రయిస్తున్నారు.
సేఫ్ అండ్ హ్యాపీ!
Published Mon, Mar 20 2017 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement