'టెర్రరిస్టు పార్టీ సపోర్టుతో బంగారు తెలంగాణ ఎలా' | Sakshi
Sakshi News home page

'టెర్రరిస్టు పార్టీ సపోర్టుతో బంగారు తెలంగాణ ఎలా'

Published Sun, Jul 3 2016 12:23 PM

'టెర్రరిస్టు పార్టీ సపోర్టుతో బంగారు తెలంగాణ ఎలా' - Sakshi

హైదరాబాద్: టెర్రరిస్టు పార్టీ సపోర్టుతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యం అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ప్రశ్నించారు. టీఆర్ఎస్కు మిత్రపక్షం ఎంఐఎం.. ఎంఐఎంకు మిత్రపక్షం టెర్రరిస్టులు అని ఆయన ఎద్దేవా చేశారు.

పాతబస్తీ మినీ పాకిస్తాన్లా తయారైందన్న రాజాసింగ్.. దీనిపై నాలుగురోజుల్లో హోం మంత్రి రాజనాథ్ సింగ్ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసీఆర్కు హిందువులు ఓట్లేయలేదా అని ఆయన మండిపడ్డారు. ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement