కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్కుమార్
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్కుమార్ నాయక్ అన్నారు. సదరు శాఖలు కూడా నిబంధనలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకొంటామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మంచి పరిపాలనా పద్ధతులు, కార్మిక విధానాలను అనుసరించాలని సూచించారు. మెరుగైన పని విధానం, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, కార్మికుల మధ్య ఆరోగ్యకర వాతావరణం తదితర అంశాలకు సంబంధించి విధానపరమైన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
‘శ్రమ సువిధ’ పోర్టల్లో చట్టాల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. శుక్రవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు, కార్మిక సంఘాలు, కార్మిక, ఇతర శాఖల అధికారులతో అనిల్కుమార్ సమీక్ష నిర్వహించారు. కార్మికుల న్యాయపరమైన హక్కులను పరిరక్షించడమే తమ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పరిశ్రమల్లో కార్మిక చట్టాల అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కాలంలో మొత్తం 3,500 పారిశ్రామిక వివాదాల్లో 1,700 కేసులను పరిష్కరించామని, సెంట్రల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లో ఇంకా 700 కేసులున్నాయని తెలిపారు.
కాగా, సమీక్షకు ఉద్దేశపూర్వకంగానే తమకు ఆహ్వానాలు పంపలేదని సీఐటీయూకు చెందిన ఎస్.నరసింహారెడ్డి అరుణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. కార్మిక శాఖ యాజమాన్యాలకే మద్దతు పలుకుతోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచడం లేదని వెంకటరావు (సింగరేణి కాలరీస్ సంఘం) చీఫ్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. కార్మికుల సమస్యలపై... సీతారామయ్య (సింగరేణి కార్మిక సంఘం), మంత్రి రాజశేఖర్ (విశాఖ స్టీల్స్-ఐఎన్టీయూసీ), గట్టయ్య(ఏఐటీయూసీ), తుమ్మల మల్లేష్, జె.ఉపేందర్ (సింగరేణి గనికార్మిక సంఘం), ప్రకాష్ (ఏపీ సీఐటీయూ), సతీష్ (ఓఎన్జీసీ), సారంగపాణి, మల్లేశం ఆయనకు వివరించారు. ఏపీ, టీఎస్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కేవీ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఎఫ్ కమిషనర్ కేకే జలానా, తెలంగాణ, ఏపీ లేబర్ కమిషనర్లు ఎన్.కృష్ణారావు, ఎస్కే మిశ్రా పాల్గొన్నారు.
ప్రభుత్వ శాఖల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన
Published Sat, Apr 23 2016 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement