హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైన్ పై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని రాష్ట్రమంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైన్ అంశంపై వస్తున్న విమర్శలపై ఆదివారం రాత్రి ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ... అఖిలపక్ష సమావేశాలు పెట్టి పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
మహారాష్ట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీపడిందని ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాకు తెలంగాణ ప్రజల హక్కులే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హరీష్ రావు సూచించారు.
ప్రతిపక్షాలపై మంత్రి తీవ్ర మండిపాటు
Published Sun, Mar 27 2016 8:17 PM
Related news
-
అయితే తిట్టు..లేదంటే ఒట్టు
వెల్దుర్తి (తూప్రాన్), చిన్నశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అయితే తిట్టు.. లేదంటే ఒట్టు అన్నట్లుగా ఆయన విధానం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రేవంత్రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో, చిన్నశంకరంపేటలో నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడారు.తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన గుంపుమేస్త్రీ గువ్వ గుయ్యిమనేలా ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హామీల అమలు చేయమని సవాల్ చేస్తే తోకముడిచి పారిపోయారని విమర్శించారు. మండుటెండల్లో గోదావరి నీరు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడిగిన మాజీ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. బీజేపీకి ఓటేస్తే ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుందన్నారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలకు మోసం మైనార్టీలకు కనీసం కేబినెట్లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ముస్లింలను సీఎం రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలను రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం రంజాన్ తోఫా కూడా అందించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే సీఎం పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని.. ప్రజలకు మేలు చేస్తుందని హరీశ్ చెప్పుకొచ్చారు. -
రేవంత్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్, సిద్దిపేటజోన్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ పొగుడుతున్నారని, రేవంత్రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు. నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్ ‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని, లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ ఆరోపించారు. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
హరీశ్.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్ రావు ఓ జోకర్లా మారారని, ఆయన అన్నీ హౌలా(పులిష్) పనులు చేస్తున్నారని అందుకే ఆయన్ను హౌవ్లేష్రావు అంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధపడితే.. ఆయన స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలే తప్ప.. సుదీర్ఘంగా పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటిస్తే..ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలని.. లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని హరీశ్ సవాల్ చేస్తూ.. ఓ డూప్లికేట్ రాజీనామా పట్టుకుని అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవాలని హరీశ్రావుకు సవాల్ విసిరారు. హరీశ్కు మతిభ్రమించింది అధికారం పోయాక హరీశ్కు మతిభ్రమించిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ, ఇవ్వాళ తాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని నిందించారు. ఆయన, ఆయన మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. జూన్ 3 తరువాత బీఆర్ఎస్ మూతే... పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మూతపడుతుందని మంత్రి జోస్యం చెప్పారు. మీ మామ చేసిన పలు హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాంగ్రెస్ బ్రాండ్ అనీ.. అప్పటికే రుణం చెల్లించిన వారికి కూడా అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ప్రోత్సాహం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన దేవత సోనియాగాంధీ అని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని ఆ తరువాత తానే సీఎం అయిన కేసీఆర్ మోసగాడని నిందించారు. -
హరీశ్రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీశ్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదు.. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు’’ అని ఎద్దేవా చేశారు.స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీశ్ తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఆయన తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది.. హరీశ్..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు.రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్ జోకర్ అయ్యాడు:మంత్రి కోమటిరెడ్డిమరోసారి రాజీనామా లేఖ పేరుతో హరీశ్రావు డ్రామాలు చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. హరీశ్ బీఆర్ఎస్లో ఉద్యోగి మాత్రమే. ఆగస్టు 15లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం. హరీశ్రావుకు పర్సనాలిటీ పెరిగింది కానీ.. బుర్ర మాత్రం పెరగలేదు. నీ దగ్గరకు పని కోసం వస్తే మంత్రిగా ఒక్క పని చేయకలేకపోయావు. రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్రావు జోకర్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు.హరీశ్రావుది దొంగ రాజీనామా. మీరు దొంగ దీక్షలు చేసినట్లు ఇప్పుడు చేస్తే నడవదు.ఇవాళ మళ్లీ మోసం చేయానికి వచ్చిండు.. నువ్వు డ్రామాలు ఆడితే ప్రజలు పట్టించుకోరు.. నువ్వు కేసీఆర్ కింద గులాం గిరి చేయాలి తప్ప నిన్ను ఎవరు పట్టించుకోరు.. 20 ఎండ్ల కింద 76 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దమ్ముంటే మెదక్లో డిపాజిట్ తెచ్చుకో.. బీఆర్ఎస్ పార్టీ జూన్ 4 నుంచి దుకాణం బంద్ అవుతుంది. కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేశారా?. తెలంగాణా వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా.. లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండదు అన్నాడు.. నువ్వు తీసుకోలేదు తలకాయ మమ్మల్ని తీయమంటావా? లేకుంటే దళితులను తీయమంటావా?’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
Related News by category
-
మాకొద్దు టీడీపీ కేడర్!
భీమవరం: బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలంతా నిన్ను నమ్మంబాబూ అంటుంటే.. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాత్రం టీడీపీ నాయకులను నమ్మే పరిస్థితి లేదని పలువురు అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యరి్థగా పోటీచేసిన అంజిబాబు ఓటర్లకు పంపిణీ కోసం ఇచ్చిన సొమ్మును సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాహా చేయడంతో పోలింగ్ రోజున ఓటర్లు ఆ పార్టీ కార్యాలయానికి వచ్చి గందరగోళం సృష్టించారు. అప్పటి ఎన్నికల్లో అంజిబాబు ఘోరంగా ఓడిపోగా ఆయనకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఐదేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వ్యా పార, వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. దీంతో భీమవరం నియోజకవర్గంలో టీడీపీ చుక్కాని లేని నావలా మారింది.ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో అంజిబాబు జనసేన పార్టీ అభ్యరి ్థగా బరిలో నిలిచారు. పార్టీలు మారడంలో దిట్ట అనే ముద్ర వేసుకున్న అంజిబాబు నుంచి అందిన కాడికి అందిపుచ్చుకోవాలనే ప్రయత్నాలు టీడీపీ శ్రేణులు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతోకొంత ఆయన నుంచి చేజిక్కుంచుకోకపోతే ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ప్రయోజనం ఏంటనే నిర్ణయానికి టీడీపీ శ్రేణులు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు అంజిబాబు అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సొమ్ముల కోసం జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంట.సొంత మనుషులతోనే కార్యాచరణ టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో పెత్తనం చేయడానికి ప్రయత్నించగా గత అనుభవాల దృష్ట్యా అంజిబాబు జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. దీంతో నామినేషన్ కార్యక్రమానికి జనాన్ని తరలించడం దగ్గర నుంచి ఎన్నికల ప్రచార వ్యవహారాలు కూడా తన బంధువులు, కావాల్సిన వారితోనే చేయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా డబ్బులు విషయంలో అంజిబాబు అతి జాగ్రత్తగా వ్యవహరించడం టీడీపీ, జనసేన కేడర్కు మింగుడు పడటంలేదు. ఎన్నికల్లో ఓడిపోతే అంజిబాబు పత్తా ఉండరు కాబట్టి అయినకాడికి దండుకునే ప్రయత్నాలను కేడర్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సొంత మనుషులతోనే అంజిబాబు ఎన్నికల కా ర్యాచరణ రూపొందించినట్టు సమాచారం. జనసేన శ్రేణుల చిందులు నరసాపురం: పట్టణంలోని దర్గా సెంటర్లో జనసేన ప్రచార కార్యక్రమంలో ఇద్దరు జర్నలిస్టులపై ఆ పార్టీనాయకులు అసభ్య పదజాలంతో దూషణలు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం డ్యాన్ మాస్టర్ శేఖర్ దర్గా సెంటర్లో జనసేన తరఫున ప్రచార కార్యక్రమానికి వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కవరేజీకి వెళ్లిన ఓ పత్రిక విలేకరి, మరో న్యూస్ చానల్ జర్నలిస్ట్పై అక్కడున్న జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కెమెరామెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలకు అడ్డువస్తున్నారు, మీరు ఎవరు? అంటూ రుసరుసలాడాడు.తాము జర్నలిస్టులమని చెప్పబోతుండగా.. జర్నలిస్టులైతే ఐడీ కార్డులు వేసుకుని తిరగాలని గర్జించారు. ‘నేనవరు అనుకుంటున్నావు.. నాయకర్ కెమెరామెన్ని, కాబోయే మంత్రి మనిషిని’ అంటూ శివాలెత్తారు. ఇప్పటికే నాయకర్ వ్యవహార తీరుపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా నాయకర్ అనుయాయుల దురుసు ప్రవర్తనతో ముందుకు వెళుతున్నారు. జనసేన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. -
ధర్మవరంలో కార్పొరేట్ పాలిటిక్స్
ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ రాజకీయం రంగ ప్రవేశం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చానన్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ గల్లీలో ప్రలోభాలు, బెదిరింపులతో నీచరాజకీయాలు చేస్తున్నారు. రూ.కోట్లు కుమ్మరించి అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వని వ్యాపారులపై సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తానంటూ తన వర్గీయుల ద్వారా బెదిరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ధర్మవరం: ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగప్రవేశం చేయగానే ధర్మవరంలో కొత్త సంస్కృతి మొదలైంది. ఆయనకు మద్దతుగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి రెండు వేల మందికిపైగా ధర్మవరంలో దిగారు. పట్టణంలోని అద్దె ఇళ్లు, లాడ్జీలలో తిష్ట వేశారు. వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. డబ్బు ఇస్తామని, నామినేటెడ్ పదవులు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని.. ఇలా పలు రకాలుగా ప్రలోభపెడుతున్నారు. గ్రామస్థాయి నాయకుడికైతే రూ.10 లక్షలు, ఓ మోస్తరు నాయకుడికైతే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు గిర్రాజు నగేశ్, ఏపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి బాబు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్లను పెద్దఎత్తున ప్రలోభపెట్టి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేర్చుకున్నట్లు సమాచారం. వీరివెంట భారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తారని భావించినప్పటికీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వంద మందితో పారీ్టలో చేరుతానని చెప్పిన గిర్రాజు నగేశ్ కనీసం పది మందికి కూడా కండువా కప్పించలేకపోయాడు. కోటిబాబు వెంట కూడా ఎవరూ వెళ్లలేదు. కోటిబాబు బీజేపీలోకి చేరిన మరుసటి రోజే ఆయన సోదరులు మళ్లీ వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. అదేవిధంగా తమ ప్రలోభాలకు లొంగని వారిని సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల పేరిట సత్యకుమార్ మనుషులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. పట్టు–చేనేత వస్త్ర వ్యాపారానికి కేంద్రమైన ధర్మవరంలో వ్యాపారులకు ఈ తరహా బెదిరింపులు ఎక్కువైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సత్యకుమార్ ప్రచారానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రొద్దుటూరు, కర్నూలు, రాప్తాడు తదితర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి వాహనాల్లో జనాలను తీసుకురాగా, వారు మధ్యలోనే వెళ్లిపోయారు. బీజేపీపై చేనేతల ఆగ్రహం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. జీఎస్టీ రద్దు చేయాలని నేతన్నలు నిరసన తెలిపినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా గత కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచాలని భావించింది. అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్లు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి చేనేత వస్త్రాలపై జీఎస్టీని పెంచడం వల్ల కలిగే నష్టాలను వివరించడంతో 5 శాతానికే పరిమితం చేశారు. ఈ క్రమంలో బీజేపీపై నేతన్నలు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
జగ్గయ్యపేట: ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యాభర్తలు ఎమ్మెల్యేగా గెలిచి 70వ దశకంలోనే చరిత్ర సృష్టించారు. 1972లో ముక్త్యాల గ్రామానికి చెందిన వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్(ముక్త్యాల రాజా) అప్పటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపాల బుచ్చరామయ్య శ్రేష్ఠిపై పోటీ చేసి గెలుపొందారు. 1974లో ఆయన మరణానంతరం భార్య వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ (ముక్త్యాల రాణి) కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పట్లోనే నియోజకవర్గ చరిత్రలో భార్యాభర్తలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత జగ్గయ్యపేటకు దక్కింది. -
నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు
ముంబయి: లోక్సభ ఎన్నికల ఐదో దశకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శివసేన (యూటీబీ) నాయకులు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ సహా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు సోమవారం ముంబైలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. అరవింద్ సావంత్ ముంబై సౌత్ నుంచి, అనిల్ దేశాయ్ ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు.సావంత్ తన నామినేషన్ ఫారమ్తో పాటు అఫిడవిట్ ద్వారా తన సంపద సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు సమర్పించారు. అరవింద్ సావంత్ భార్య అనుయా అరవింద్ సావంత్ పేరిట ఉన్న ఆస్తుల సమాచారాన్ని కూడా అఫిడవిట్లో ప్రస్తావించారు.అఫిడవిట్ ప్రకారం.. అరవింద్ సావంత్ వద్ద ప్రస్తుతం రూ.135000 నగదు ఉందని, అతని భార్య వద్ద రూ.60000 ఉందని వెల్లడించారు. సావంత్ వద్ద 251.070 గ్రాముల బంగారం, 3000 గ్రాముల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. సావంత్ భార్య వద్ద 509.10 గ్రాముల బంగారం, 8000 గ్రాముల వెండి ఉందని వెల్లడించారు. అరవింద్ సావంత్ ఆస్తి మొత్తం రూ.2 కోట్ల 13 లక్షల 91 వేల 322. భార్య పేరు మీద 2 కోట్ల 26 లక్షల 65 వేల 869 రూపాయల ఆస్తులున్నట్లు వివరించారు.ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న శివసేన నేత రాహుల్ షెవాలే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ముంబై సౌత్ నుంచి డాక్టర్ మయూరి సంతోష్ షిండే, సబీహా బానో సహా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ముంబైలోని ఆరు స్థానాలకు మే 20న ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి చివరి రోజు మే 3.मुंबई दक्षिण मध्य लोकसभा मतदारसंघातील महाविकास आघाडीचे अधिकृत उमेदवार अनिल देसाई ह्यांनी त्यांचा उमेदवारी अर्ज दाखल केला. ह्यावेळी युवासेनाप्रमुख शिवसेना नेते आमदार आदित्य ठाकरे, शिवसेना उपनेत्या खासदार प्रियंका चतुर्वेदी, खासदार चंद्रकांत हंडोरे, आमदार प्रकाश फातर्पेकर, शिवसेना… pic.twitter.com/wXwI2MDs8k— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) April 29, 2024 -
యార్లగడ్డకు ఎదురుగాలి!
సాక్షి ప్రతినిధి,విజయవాడ: గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఎదురుగాలి వీస్తోంది. ఆయన నోటి దురుసుతనం, అహంకారం కొంపముంచుతోంది. నియోజకవర్గంలో ఓటర్లను దూరం చేస్తోంది. ఆయన ఒంటెత్తు పోకడలతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది. ఆయన టీడీపీ సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శ ఉంది. మిగిలిన సామాజిక వర్గాల వారిని కనీసం దరికూడ చేరనీయడం లేదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన వర్గాలు కనీస గౌరవంకూడా దక్కటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. పెరిగిన అంతరం ఇటీవల హనుమాన్జంక్షన్లో జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించ లేదు. దీంతో కాపులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జనసేన, కాపు సామాజిక వర్గాలు యార్లగడ్డకు మధ్య అంతరం మరింత పెరిగింది. బీసీ, ఎస్సీ వర్గాలను పట్టించుకోక పోవడంతో వారూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో ఆయన ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగిలిన గ్రామాలకు తమ కుటుంబ సభ్యులను పంపి మమ అనిపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గాలను చిన్న చూపుచూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వర్గాల వారు షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతిని సబ్బుతో కడిగి, శానిటైజర్తో శుభ్రం చేసుకుంటున్నారని ఆపార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. దీంతో ఆయన ఎస్సీలపై ఎంత సామాజిక వివక్ష చూపుతున్నారో అర్థమవుతోందని తెలుస్తోంది. టీడీపీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు కాకుండా ఇతరులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.బీజేపీ సహకారం అంతంతమాత్రం నియోజకవర్గంలో బీజేపీ మాత్రం ఆయన అభ్యర్థత్వాన్ని బలపరచటం లేదు. నియోజక వర్గంలో బీజేపీలో కీలకంగా ఉండే కొర్రపోలు శ్రీనివాస్, సర్నాల విజయదుర్గ, రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. దీంతో బీజేపీ నుంచి పూర్తిగా సహకారం లభించడంలేదు. పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ టీడీపీలోని వారికే తాయిలాలు ఇచ్చి, ప్రలోభపెట్టి వారికే కండువాలు కప్పి, పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు అంటూ, పచ్చ మీడియాలో ఉదరగొడుతున్నారు. యార్లగడ్డ సమక్షంలో డబ్బుకోసం ఆయన పక్షాన చేరినవారంతా, ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా బస్సుయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ ప్రచారం, హడావుడి అంతా పాలపొంగు లాంటిదేనని, ఆయనకు ఈసారీ ఎన్నికల్లో విజయం దక్కదనే భావన నియోజక వర్గ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. వంశీ ప్రచార జోష్ ఇప్పటికే గన్నవరం నియోజక వర్గం నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన హాట్రిక్ సాధించేందుకు తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 58 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ సీపీకి దన్నుగా నిలుస్తున్నాయి. ఇటీవల నియోజక వర్గంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలనుంచి అనూహ్య స్పందన లభించింది. నామినేషన్ కార్యక్రమానికి సైతం జనాలు పోటెత్తారు. ఈ పరిణామాలన్నీ నియోజక వర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయి. అసెంబ్లీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి కష్టాల్లో పలు పంచుకుంటున్న వైనం నియోజక వర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన ప్రచారానికి జనాలు అడుగడునా నీరాజనాలు పలుకుతున్నారు. నియోజక వర్గంలో వ్యక్తిగతంగా వంశీని అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది, ఇవన్నీ ఈ విజయానికి కలసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement