* టీడీపీ, కాంగ్రెస్లపై మంత్రి ధ్వజం
* ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర వారిదే
* సభను అడ్డుకుంటే సస్పెండ్ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీ, కాంగ్రెస్లు ఇప్పు డు గురువిందగింజ తన నలుపెరగని చందంగా వ్యవహరిస్తున్నాయని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. శనివా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్,టీడీపీ నేతల ద్వంద్వ వైఖరిని దుయ్యబట్టారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ గాలం వేసి తనలో చేర్చుకుంటోందని, ఇది అనైతికమంటూ వ్యాఖ్యానించే నైతిక అర్హత కాంగ్రెస్, టీడీపీ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి సైతం టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన వారే. ఇందిర హయాంలో టీడీపీని చీల్చి నాదెండ్ల భాస్కర్రావును ముఖ్యమంత్రిగా చేశారు.
అణుఒప్పందం సమయంలో మన్మోహన్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎంపీలను కొనుగోలు చేసింది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు చెందిన విజయశాంతి, అరవింద్రెడ్డిలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. వైఎస్ హయాంలో సైతం పదిమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఆనాడు ఇది తప్పనిపించలేదా?’ అని హరీశ్ సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీలోకి ఇతర నేతలు రావడం ఈరోజే కొత్త కాదని, ఉద్యమ సమయంలో సైతం కేకే, జూపల్లి కృష్ణారావు, రాజయ్య, మందా జగన్నాథం వంటి నేతలు టీఆర్ఎస్లో చేరారని హరీశ్ గుర్తు చేశా రు. ఇక టీ టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘తెలుగుదేశం నెలకొల్పినప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు.
ఆయన కాంగ్రెస్ నుంచి ఫిరాయించినవారే కదా’ అని అన్నారు. ఆత్మహత్యలపై టీడీపీ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో దేశంలోని పార్టీలన్నీ ఒక్కటై పోరాడాయని, అలాగే, కావేరీ జలాల విషయంలో తమిళనాడులోని పార్టీలన్నీ ఏకమై పోరాడాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వని చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం వెనకేసుకొస్తున్నారని ఆరోపిం చారు.
‘రాష్ట్రం తరఫున మాట్లాడాల్సింది పోయి బాబుకు వంతపాడుతున్నారు’ అని విమర్శిం చారు. అసెంబ్లీలో వ్యవసాయ, విద్యుత్ సహా అన్ని అంశాలపై తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, సభ జరిగితే బాబు బండారం బయటపడుతుం దనే భయంతో టీడీపీ ఎమ్మెల్యేలు సభకు అడ్డుతగిలారని తెలిపారు. సోమవారం ఈ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధమని, సభను అడ్డుకుంటే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసైనా చర్చ చేపడతామని హరీశ్ స్పష్టం చేశారు.
నైతిక విలువలు నాడేమయ్యాయి: హరీశ్రావు
Published Sun, Nov 9 2014 12:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement