నేడు న్యాయ, వైద్య నిపుణులతో వైద్య మంత్రి భేటీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘నీట్’ ద్వారానే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కారు తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఏం చేయాలో అర్థంగాక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఏంచేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి న్యాయ, వైద్య నిపుణులు సహా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి, వైద్య విద్య సంచాలకులు రమణి తదితరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ‘నీట్’పై ఈ సమావేశంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఇదే అంశంపై తర్జనభర్జన పడుతున్న నేపథ్యంలో వారేం నిర్ణయం తీసుకుంటారోనని తెలంగాణ ఎదురుచూస్తోంది. అవసరమైతే రెండు రాష్ట్రాలు కలసి సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే యోచన కూడా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్తో ఫోన్లో సంభాషించారు. నీట్పై ఉమ్మడిగా అప్పీలుకు వెళ్లే అంశం వారిద్దరి చర్చల్లో వచ్చింది. నీట్పై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నందున ఆ రాష్ట్రాలతోనూ చర్చించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది.
తెలుగులో పరీక్షపైనా..
నీట్ నుంచి ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరిస్తే అందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. నీట్ తప్పనిసరైతే ఏం చేయాలో కూడా నిర్ణయం తీసుకోనుంది. అలాగే స్థానిక భాషలో ప్రశ్నపత్రం ఉండేలా కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. పైగా సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం నీట్ పరీక్ష ఉంటుందని చెబుతున్నందున దాన్ని ఎలా ఎదుర్కోవాలో సర్కారు ఆలోచన చేస్తోంది.
ఇదిలావుంటే నీట్పై స్పష్టత రాకపోవడంతో మెడికల్ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే బీ కేటగిరీ మెడికల్ సీట్లను అమ్మేసుకున్న ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు నీట్ పరీక్ష తప్పనిసరైతే ఏం చేయాలోనని మదనపడుతున్నారు. సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ఇష్టారాజ్యంగా ఏమైనా చేసుకోవచ్చనే దానికి నీట్ పరీక్ష చెక్ పెడుతుందని.. అమ్మేసుకున్న సీట్లను ఏం చేయాలో అర్థం కావడం లేదని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ యజమాని పేర్కొన్నట్టు తెలిసింది.
బీ కేటగిరీ సీట్లకు డబ్బులు చెల్లించి సీటు రిజర్వు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా నీట్ పరీక్ష తప్పనిసరైతే తమ డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. ఇదిలావుంటే ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉండే 15 శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా నీట్ ర్యాంకు ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ సీట్లు ఇప్పటికే భర్తీ అయిపోయాయి. తల్లిదండ్రులు రూ. కోట్లు చెల్లించి వాటిని కొనేశారు. దీంతో రూ. కోట్లు పెట్టిన తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
‘నీట్’పై తర్జనభర్జన
Published Mon, May 2 2016 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement