హైకోర్టు విభజన కేంద్రం చేతిలో లేదు - నల్లు | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజన కేంద్రం చేతిలో లేదు - నల్లు

Published Sun, Jul 3 2016 5:41 PM

High Court Division Not in the hands of The central government

దేశంలో అవినీతికి తావులేకుండ ప్రధానమంత్రి మోడీ తన పాలన కొనసాగిస్తున్నాడని బీజేపీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అధివారం నాడు తుర్కయాంజాల్‌లోని సామ శ్రీనివాస్‌రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన హయత్‌నగర్ మండల బీజేపీ మండల పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజైరైనారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్డు విభజన కేంద్రం చేతిలో లేదని రాష్ట్రాలు, జడ్జీలు తేల్చుకోవాల్సిన విషయమని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడి జన్ పేరుతో వేల కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోరెడ్డి నర్సింహ్మరెడ్డి, సెన్సార్‌బోర్డు సభ్యులు బోసుపల్లి ప్రతాప్,అధ్యక్షులు బొడిగే గోవర్ధన్, సర్పంచ్ సానేం అంజయ్య, ఎంపీటీసీలు మారగోని శ్రీనివాస్‌గౌడ్, బుర్ర మహేష్, నాయకులు బచ్చిగల రమేష్, వడ్డేపల్లి పాపయ్యగౌడ్, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement