బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి | Sakshi
Sakshi News home page

బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి

Published Wed, Sep 21 2016 3:10 AM

బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. తారకంకు నివాళులు అర్పించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
 
ఈ కార్యక్రమంలో తారకం కుటుంబ సభ్యులు, తెలంగాణ అదనపు ఏజీ రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థకు తారకం చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని ఏసీజే అన్నారు. తారకం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement