ఓయూలో ఉద్రిక్త వాతావరణం | Sakshi
Sakshi News home page

ఓయూలో ఉద్రిక్త వాతావరణం

Published Wed, Mar 18 2015 12:18 PM

High tension in osmania university campus

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగ ఐకాస నాయకులు బుధవారం ఆర్ట్ కళాశాల మైదానం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని ఐకాస నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగ ఐకాస నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీలో మోహరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement