- జేఎన్టీయూహెచ్ - విజిలెన్స్ తనిఖీల మధ్య భారీగా వ్యత్యాసాలు
- మూడు కేటగిరీలుగా కాలేజీల విభజనకు ప్రభుత్వ ఆదేశాలు
- నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపునకు కసరత్తు!
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్షలో నిర్ణయం
- ఫీజుల నిర్ణయంపై ఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం 29కి వాయిదా
- ఫలితంగా వెబ్ ఆప్షన్లు, ప్రవేశాల్లో తప్పని ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో వసతులు, ఫ్యాకల్టీ తదితర అంశాల్లో ఇటు జేఎన్టీయూహెచ్, అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన తనిఖీల మధ్య అనేక తేడాలు వెల్లడయ్యాయి. జేఎన్టీయూ చేపట్టిన తనిఖీల సందర్భంగా కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడి కాగా, విజిలెన్స్ తనిఖీల సందర్భంగా మరిన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. జేఎన్టీయూహెచ్ లోపాలు లేవని భావించిన కొన్ని కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీల సందర్భంగా లోపాలు బయట పడ్డాయి. ఇక విజిలెన్స్ విభాగం లోపాలు లేవని నివేదికలు రూపొందించిన కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు జేఎన్టీయూహెచ్ చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తం 247 ఇంజనీరింగ్ కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జేఎన్టీయూహెచ్ లోపాలు ఉన్నట్లు తేల్చిన కాలేజీలు, లోపాలు లేవని తేల్చిన కాలేజీలతో ఒక నివేదిక, విజిలెన్స్ విభాగం లోపాలు ఉన ్నట్లు తేల్చిన కాలేజీలు, లోపాలు లేవని తేల్చిన కాలేజీలతో మరో నివేదిక, రెండు విభాగాల నివేదికల మధ్య తేడాలు కలిగిన (ఒక దాంట్లో లోపాలు ఉన్నవి, మరోదాంట్లో లోపాలు లేనిని, ఒకదాంట్లో బాగున్నవి, మరొక దాంట్లో బాగా లేవని తేల్చినవి) కాలేజీల జాబితాతో కూడిన ఇంకో నివేదిను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జేఎన్టీయూహెచ్ను ఆదేశించారు. ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు, కాలేజీల తనిఖీల వ్యవహారంపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు కేటగిరీలుగా కాలేజీలను విభజించాక తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తానికి ఈ నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చేలా కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారం బుధవారం ఓ కొలిక్కి వస్తుందని భావించినా అది సాధ్యం కాలేదు. త్వరలోనే మరోసారి సమావేశమై తేల్చే అవకాశం ఉంది.
ఎటూ తేలని ఫీజుల వ్యవహారం
మరోవైపు బుధవారం జరిగిన ఎఫ్ఆర్సీ కమిటీ సమావేశంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో వచ్చే మూడేళ్లపాటు వసూలు చేసే ఫీజుల ఖరారు వ్యవహారం ఎటూ తేలలేదు. పలు అంశాలపై స్పష్టత రాక.. ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఈ నెలాఖరులోగా ఫీజులు ఖరారు అవుతాయని భావించినా అది సాధ్యం అయ్యేలా లేదు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు, ఫీజులు ఖరారు అయితేనే ప్రవేశాలు చేపట్టే కాలేజీల జాబితాను విద్యార్థులకు అందుబాటులోకి తేవడం సాధ్యం. ఈ నేపథ్యంలో వెబ్ ఆప్షన్లు, ప్రవేశాల కౌన్సెలింగ్లో ఆలస్యం తప్పేలా లేదు.
కాలేజీల తనిఖీ నివేదికల్లో తేడాలు!
Published Thu, Jun 23 2016 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement