నాంపల్లి: తెలంగాణలో నిరుద్యోగుల అవస్థలు గమనించి వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం నాంపల్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటును దాటుకుని లోనికి దూసుకెళ్లారు. చైర్మన్ కార్యాలయంలోనికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
నిరుద్యోగులు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. మన పక్కన ఉన్న ఏపీలో ఇప్పటికే డీఎస్సీని విడుదల చేసిందని గుర్తు చేశారు.
తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు వయసు మీద పడి అవకాశాలను అందుకోలే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. అలాగే కాంట్రాక్టు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నెలరోజుల్లోగా అన్ని ఉద్యోగాలకూ ప్రకటనలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు జె.కళ్యాణ్, భీమ్రావ్ నాయక్, డోలంకి శ్రీనివాస్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులపై కేసులు తగదు
అఫ్జల్గంజ్: విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జె.నిరంజన్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం మాని... శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం.. నాన్బెయిల్బుల్ కేసులు బనాయించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
సోమవారం విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠి చార్జి చేయడం, వరంగల్ ముఖ్యమంత్రికి సమస్యలను వివరించడానికి వెళ్లిన 12 మంది విద్యార్థులపై నాన్బెయిల్బుల్ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తున్న ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కదంతొక్కిన నిరుద్యోగులు
Published Tue, Dec 30 2014 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement