జర్నలిస్టుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందులు
సిటీబ్యూరో: ‘‘వాహనదారుల నుంచి లంచం డబ్బులు తీసుకుంటాం..నీకేంటి నొప్పి’’ అంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై జర్నలిస్టుపై చిందులు తొక్కాడు. అంతటితో ఆగకుండా ఆ జర్నలిస్టును దుర్భాషలాడాడు.
కానిస్టేబుల్ వీరంగం అతని మాటాల్లోనే...
‘‘లంచం డబ్బులు తీసుకుంటాం... అడగడానికి నీ వెవ్వరు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోడ్లపై డ్యూటీలు చేస్తాం. యాబ్భైయ్యో.. వందో సంపాదించుకుంటాం తప్పేంటి. కమిషనర్కు ఫిర్యాదు చేసుకున్నా భయంలేదు. కావాలంటే నేను నిన్నే కమిషనర్ మహేందర్రెడ్డి వద్దకు తీసుకెళ్తా పదా. నీవే యాబై వేలు అడిగావంటూ ఫిర్యాదు చేస్తా. నీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయిస్తా’’..
సైదాబాద్కు చెందిన జర్నలిస్టు జావెద్ తన బైక్పై గురువారం మధ్యాహ్నం 2.30కి రాజ్భవన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాడు. అక్కడి రహదారిపై వచ్చిపోయే వాహనాలను పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ జయరాం ఆపి డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని జావెద్ గమనించాడు. తన సెల్ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో అటు వైపుగా వచ్చిన ఆడి కారును కానిస్టేబుల్ ఆపాడు. డ్రైవర్తో కారు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించలేదని అడిగాడు. ఇంతలో డ్రైవర్ పక్కన కూర్చున్న పెద్ద మనిషి జేబులోంచి రూ. 100 నోట్ను తీసి కానిస్టేబుల్కు ఇవ్వడంతో కారును వదిలిపెట్టాడు. ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించి హాక్-ఐ ద్వారా నగర కమిషనర్కు జావెద్ ఫిర్యాదు చేశాడు. ఇంతలో విషయం తెలుసుకున్న కానిస్టేబుల్..జావెద్ను పట్టుకుని లంచం తీసుకుంటే నీ కేందిరా అంటూ నానా బూతులు తిట్టాడు.
అంతటితో ఆగకుండా పంజగుట్ట ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సిబ్బందిని కూడా అక్కడికి రప్పించి నానా రభస సృష్టించి జావెద్ను ఠాణాకు తీసుకెళ్లారు. ఇంతలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ షేక్ మాసూమ్ బాషాలు అసలు విషయం తెలుసుకుని జావెద్ను నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. హాక్-ఐకు పంపిన వీడియోను సైతం ఏసీపీలు తీసుకున్నారు. లంచం తీసుకోవడం, జర్నలిస్టును పట్టుకుని హింసించడంపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.ఎస్ఐ స్థాయి అధికారి లేకుండా సదరు కానిస్టేబుల్ వాహనాలను ఆపడం నేరమే. కాగా ట్రాఫిక్ విభాగంలో దేశంలోనే తొలిసారిగా ట్రాఫిక్ క్యాష్ లెస్ చలానా విధానాన్ని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రారంభించిన మూడు రోజులకే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.
లంచం తీసుకుంటాం..నీకేంటీ నొప్పి...
Published Sat, Jan 24 2015 10:29 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement