గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు ఆందోళన | Sakshi
Sakshi News home page

గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు ఆందోళన

Published Tue, Jul 1 2014 10:38 AM

గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు ఆందోళన

తమకు రక్షణ కల్పించాలంటూ దాదాపు 500 మంది జూనియర్ డాక్టర్లు మంగళవారం గాంధీ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద సమ్మెకు దిగారు. దాంతో ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఓపీ లేకపోవడంతో 3 వేల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ వారికి తక్షణం వైద్య సహాయం అందించాలని రోగుల బంధువులు ఓపీ బ్లాక్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద పోటాపోటీ ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
Advertisement