ఎందుకిలా ప్రజలను మోసగిస్తున్నారు ? | Sakshi
Sakshi News home page

ఎందుకిలా ప్రజలను మోసగిస్తున్నారు ?

Published Wed, Dec 2 2015 4:49 PM

ఎందుకిలా ప్రజలను మోసగిస్తున్నారు ? - Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి నిప్పులు చెరిగారు. చేనేత రుణమాఫీ అంటూ మరోచేతగాని మాఫీకి చంద్రబాబు సర్కార్ సిద్ధమైందని ఆయన బుధవారమిక్కడ ఎద్దేవా చేశారు. టీడీపీ మరో వర్గానికి ఇప్పుడు మొండిచేయి చూపుతోందని, ఎందుకిలా ప్రజలను మోసగిస్తున్నారంటూ ఆ పార్టీపై పార్థసారథి మండిపడ్డారు.

ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమే మీ ఉద్దేశమా అంటూ పార్థసారథి  నిలదీశారు. ఎంతసేపు ప్రజలకు ఎలా వాతలు పెట్టాలా అన్నదే చంద్రబాబు ఆలోచన అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే రుణమాఫీ అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించారని, ఇప్పుడు చేనేత కార్మికుల వంతు వచ్చిందన్నారు. బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని పార్థసారథి డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement