కేసీఆర్ బోళాశంకరుడు: కడియం | Sakshi
Sakshi News home page

కేసీఆర్ బోళాశంకరుడు: కడియం

Published Mon, Jul 6 2015 3:08 AM

కేసీఆర్ బోళాశంకరుడు: కడియం - Sakshi

పోచమ్మమైదాన్: ఐక్యతగా సీఎం కేసీఆర్ దగ్గరకు  వెళ్లి తమ సమస్యలు ఏకరువు పెడితే... వారు కోరిన దానికంటే ఎక్కువగా బోళాశంకరుడి వలే వరాలు కురిపిస్తారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లోని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా మహాసభ ఆదివారం జరిగింది. శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హజరైన సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. శాసన మండలి ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎమ్మెల్యేల కొనుగోలులో దొంగ అడ్డంగా దొరికాడన్నారు.

ఆ దొంగ బెయిల్‌పై విడుదలైన సందర్భంగా రూ. లక్షలు ఖర్చు చేసి ఊరేగింపు చేయడం వారికే చెల్లిందన్నారు. సభలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్, శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శృంగారపు భాస్కరాచారి పాల్గొన్నారు.

Advertisement
Advertisement