'బీజేపీ, ఆరెస్సెస్కు ఇష్టం లేదు' | Sakshi
Sakshi News home page

'బీజేపీ, ఆరెస్సెస్కు ఇష్టం లేదు'

Published Wed, Jan 20 2016 11:16 AM

'బీజేపీ, ఆరెస్సెస్కు ఇష్టం లేదు' - Sakshi

హైదరాబాద్ : దేశంలో దళితులు బాగుపడటం బీజేపీ, ఆరెస్సెస్కు ఇష్టం లేదని ప్రొ. కంచె. ఐలయ్య ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో ప్రొ. కంచె ఐలయ్య విలేకర్లతో మాట్లాడుతూ... హెచ్సీయూ విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తారా ? అని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల గదుల్లో ఆయుధాలు ఏమైనా దొరికాయా ? అని నిలదీశారు.

విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ ఓ కేంద్రమంత్రి ఎలా కేంద్రానికి లేఖ రాస్తారన్నారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్కు రాజకీయాలతో సంబంధం లేదని ఐలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యూనివర్శిటీల్లో అగ్రకులాల ఆధిపత్యం నశించాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రొ.కంచె ఐలయ్య, ప్రొ.విశ్వేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు.

Advertisement
Advertisement