రైతులకు ఏం ఒరగబెట్టారని పాదయాత్ర? | Sakshi
Sakshi News home page

రైతులకు ఏం ఒరగబెట్టారని పాదయాత్ర?

Published Tue, Nov 8 2016 2:50 AM

Karne Prabhakar fires on TTDP

టీటీడీపీపై మండిపడ్డ ఎమ్మెల్సీ కర్నె
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల ఉసురు పోసుకు న్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. టీడీపీ గ్యాంగ్.. పచ్చని పంటపొలాలను నాశనం చేసే మిడతల దండు అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన  విలేకరులతో మాట్లాడుతూ.. అన్నదాతల ఉసురు పోసుకున్న టీడీపీ నీచపు చరిత్ర ప్రజలింకా మరిచిపోలేదని, ఏమాత్రం సిగ్గూశరం లేకుండా ఆ పార్టీ నేతలు రైతు పోరు యాత్ర పేరుతో పగటి వేషాలు వేస్తున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement