‘హైకోర్టు’పై కేంద్రంతో అమీతుమీ | Sakshi
Sakshi News home page

‘హైకోర్టు’పై కేంద్రంతో అమీతుమీ

Published Tue, Jun 28 2016 2:33 AM

‘హైకోర్టు’పై కేంద్రంతో అమీతుమీ - Sakshi

► ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా!
 
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన వివాదంపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో ఆందోళన చేయాలని యోచిస్తున్నారు. న్యాయాధికారులు, ప్రజలకు న్యాయం కోసం ఢిల్లీ కేంద్రంగా ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని యోచిస్తున్నారు.

Advertisement
Advertisement