‘చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరు’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరు’

Published Thu, May 5 2016 2:22 AM

Left parties comments on Chandrababu

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పినందున ఇకనైనా కళ్లు తెరవాలని, నరేంద్రమోదీపై భ్రమలు వీడాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వామపక్షాలు స్పష్టం చేశాయి. ఇప్పటికైనా పోరు బాట పట్టాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈమేరకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు బుధవారం వేర్వేరు ప్రకటనలు చేశారు. తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement