సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి వివాదాస్పదమైన ఆరు ప్రశ్నలను పక్కనపెట్టి మిగిలిన 144 జవాబులనే పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని టీఎస్పీ ఎస్సీ, ఏపీపీఎస్సీలను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాము మరోసారి ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘కీ’ లో తప్పుల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ తుది ‘కీ’లో 6 ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఉన్నాయం టూ కొందరు అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించారు.
విచారణ జరిపిన ట్రిబ్యునల్ 4 ప్రశ్నల విషయంలోనే కమిటీని ఏర్పా టు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేయడంతోపాటు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు ప్రస్తుత ఇంటర్వ్యూలను నిలిపేయాలని హైదరాబాద్కు చెందిన కె.ప్రసాద్, సి.హెచ్.నాగమురళీకృష్ణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్వ్యూలను కొనసాగించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునేంత వరకు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయవద్దని ఏపీపీఎస్సీని ఆదేశించిం ది. తుది ‘కీ’లో వివాదాస్పదంగా మారిన డీ సీరీస్లోని 4 ప్రశ్నల విషయంలో ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ 4 ప్రశ్నల వ్యవహారాన్ని యూపీఎస్సీకు నివేదించింది. దీనిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకుని నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీపీఎస్సీ సుప్రీంలో సవాల్ చేయగా వాదనలు విన్న కోర్టు వివాదాస్పద 6 ప్రశ్నలను పక్కనపెట్టి మిగిలిన 144 జవాబులనే పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది.
సుప్రీం తీర్పు మేర నడుచుకోండి
Published Sat, Sep 10 2016 12:59 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement