మద్యం ధరల పెంపు | Sakshi
Sakshi News home page

మద్యం ధరల పెంపు

Published Fri, Oct 23 2015 9:35 PM

మద్యం ధరల పెంపు - Sakshi

హైదరాబాద్: ప్రయాణికుల నడ్డి విరిగేలా ఆర్టీసీ బస్ చార్జిలు పెంచిన కొద్ది సేపటికే మద్యం ధరలను కూడా పెంచుతున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఖరీదైన ప్రీమియం మద్యంతోపాటు సామాన్యుడు సేవించే చీప్ లిక్కర్ ధర కూడా పెరిగింది.

ఈ మేరకు జీవో నంబర్ 394, 395 లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని పేర్కొంది. ధరల పెరుగుదలలోని ముఖ్యాంశాలు

  • ప్రీమియం మద్యం ధరలు: కనిష్ఠంగా రూ. 25 నుంచి గరిష్ఠంగా రూ. 100 పెంపు
  • చీప్ లిక్కర్: కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.10 పెంపు
  • బీరు, వైన్ ధరల్లో స్వల్ప తగ్గుదల
  • పెరిగిన ధరలతో ప్రభుత్వానికి ఏటా రూ.200 కోట్ల అదనపు ఆదాయం

Advertisement

తప్పక చదవండి

Advertisement