ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులు
17 మంది కలలు నెరవేర్చిన ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’
అందరిలాగానే వారికీ కొన్ని ఆశలున్నాయి...ఆశయాలు ఉన్నాయి. అవి తీరే దారి మాత్రం కనిపించలేదు. ఆ దారిని మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చూపించింది. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న 17 మంది చిన్నారులు కోరిన కానుకలు అందించి... సహృదయతను చాటుకుంది. ఈ క్రతువులో పోలీసులూ పాలు పంచుకున్నారు. ఆ చిన్ని కళ్లల్లో ఆనందాన్ని నింపారు.
సిటీబ్యూరో: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న కొంతమంది చిన్నారుల కలలు నెరవేర్చేందుకు ఓ సంస్థ ముందుకు వస్తే...దానికి తమవంతు సాయం అందించిన పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యం చూసిన బాధితుల తల్లిదండ్రులు తమ బిడ్డల పరిస్థితి తలచుకొని తల్లడిల్లుతూనే... ఆ సంస్థ... పోలీసుల దయార్ధ్ర హృదయానికి ఉప్పొంగిపోయారు. వివరాల్లోకి వెళితే... ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతూ నగరంలోని వివిధ ఆస్పత్రులలో 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరంతా ఎన్నో రోజులుగా కావాలనుకుంటున్న వస్తువులు...బొమ్మలను అందించేందుకు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ‘వరల్డ్ విష్ డే’ సందర్భంగా బషీర్బాగ్లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చిన్నారులు కోరిన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులను ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు.
మనో ధైర్యం కల్పిస్తే... వారు తొందరగా కోలుకుంటారని చెప్పారు. ఇలా ధైర్యం కల్పించేందుకు యత్నిస్తున్న మేక్ ఎ విష్ ఫౌండేషన్ కృషిని అభినందించారు. డాక్టర్లు ఇంద్రసేనారెడ్డి, సదాశివుడు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులను తగ్గించే దిశగా వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ను సైతం జయించే రోజులు వచ్చాయని తెలిపారు. మందుల వినియోగంతో పాటు బాధితులకు ఆత్మస్థైర్యం కల్పిస్తే వ్యాధి నుంచి త్వరగా బయటపడతారని చెప్పారు. ఈమేరకు అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి కలసి చిన్నారులు అవదూత్ భవాని (15), చెన్నకేశవ(17), పి.మహేష్ (17),శుభం (15), సుమేరాఫాతిమా (16), మహ్మద్ అబ్దుల్ ఖాదర్ (16), అన్కూరి పరశురాములు (16), అంకూష్ లహరి(15)లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. కె.శ్రీను (15), మహ్మద్ మునావర్అలీ (12), మాస్టర్ సాత్విక్ (16), జి.కుమార్ (15)లకు ప్లే స్టేషన్ (బొమ్మలాట)లు, జి.సంహిత్ (16), ప్రశాంత్ (13)లకు ల్యాప్టాప్లు, సంజయ్మోర్ (14)కు మ్యూజిక్ కీబోర్డు, పావని (17)కి ఐపాడ్, అరుణ్కుమార్ (7)కు ఎలక్ట్రానిక్ బైక్లను అందించారు.
తమ పిల్లల్లో ఆనందాన్ని నింపేందుకు ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషిని చూసిన ఆ తల్లిదండ్రులు చెమర్చిన కళ్లతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగ ల్, ఉప్పల్, అనంతపూర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ఈ చిన్నారులు నగరంలోని డయాబైడ్, ఎంఎన్జే, తలసీమియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ైవె ద్యులుగా... ఇంజినీర్లుగా ఎదగాలనేది తమ ఆశయమని ఆ చిన్నారులు చెప్పినపుడు అక్కడి వారి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. తమను ఆదుకునేందుకు ఇంతమంది ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని వారంతా కృతజ్ఞతలు చెప్పారు.
కలత తీర్చి... కల నెరవేర్చి!
Published Wed, Apr 29 2015 11:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement