నాంపల్లి: మంగళవారం తెల్లవారు జామున 2 గంటలకు పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులు హబీబ్నగర్ ఠాణా పరిధిలోని మాన్గార్ బస్తీ, సమీపంలోని అఫ్జల్సాగర్, జవహర్నగర్లను చుట్టుముట్టారు. 36 బృందాలుగా ఏర్పడి కార్డన్ అండ్ సర్చ నిర్వహించారు. అన్ని ఇళ్లకు వెళ్లి నిద్రలో ఉన్న వారిని లేపి సోదాలు జరిపారు.
ఉదయం 5 గంటల వరకు తనిఖీలు చేశారు. 56 మంది అనుమానిత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.40 తులాల బంగారం, కిలో వెండి, రూ.75 వేల నగదు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దాడులకు నిరసనగా ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో ముగ్గురు రెండు హత్య కేసుల్లో నిందితులని, మిగతా వారు వంద కేసుల్లో నేరస్తులని తెలిసింది.
ఏసీపీ కార్యాలయం కిటకిట...
మాన్గార్ బస్తీ, అఫ్జల్సారగ్ బస్తీల్లోని కొందరిని నేరస్తులుగా అనుమానితులను పోలీసులు గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీపీ కార్యాలయం కిటకిటలాడింది. హబీబ్నగర్ పోలీసులు వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆధార్, రేషన్ కార్డులను తీసుకున్నారు.
బయటి రాష్ట్రాల్లో బంగారం తాకట్టు...
మాన్గార్ బస్తీలో ఉంటున్న నేరస్తులందరూ హైదరాబాద్తో పాటు నాందేడ్, గుల్బర్గా పట్టణాల్లో తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకున్నట్లు పోలీసులకు రసీదులు లభించాయి. పరారీలో ఉన్న రిసీవర్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
భారీగా మద్యం బాటిళ్లు లభ్యం...
మాన్గార్ బస్తీలో ఉండే నేరస్తుల ఇళ్లల్లో భారీగా మద్యం బాటిళ్లు దొరికాయి. వీరందరూ వైన్ షాపులు బంద్ ఉన్న సమయాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ ఇక్కడ మద్యాన్ని అమ్ముతుం టారు. అంతేకుండా గుడుంబా, గంజాయి కూడా విక్రయిస్తుం టారు. ఈ మద్యం బాటిళ్ల వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు సమాచారం. అతడిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది.
వీడిన హత్యాయత్నం కేసు మిస్టరీ: ముగ్గురు బాలనేరస్తుల అరెస్టు
కార్డన్ అండ్ సర్చ్లో ఓ హత్య కేసు మిస్టరీ వీడింది. 16-17 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు పాతబాలనేరస్తులను పోలీసులు విచారించగా హత్య విషయాన్ని బయటపెట్టారు. జల్సాలకు అలవాటుపడ్డ ఈ ముగ్గురూ ఫుట్పాత్పై నిద్రించేవారిని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసిన వ్యక్తి ముక్కు వద్ద వైట్నర్ ఉంచి అతడు మరింత మత్తులోకి వెళ్లేలా చేస్తారు. తర్వాత దాడి చేసి, డబ్బు దోచుకుంటారు.
ఇదే క్రమంలో ఈనెల 11న గోకుల్నగర్ సమీపంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న 45 ఏళ్ల వ్యక్తిపై వైట్నర్ ప్రయోగించారు. అతను అంతలోనే మేల్కోవడంతో తలపై బండరాయితో మోదారు. ఇది గమనించిన ఓ వ్యక్తి హబీబ్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి అపస్మారకస్థితిలో ఉన్న బాధితుడిని ఉస్మానియాకు తరలించగా.. చికిత్సపొందుతూ ఈనెల 15న మృతి చెందాడు. కాగా, మంగళవారం కార్డన్ అండ్ సర్చ్లో పోలీసులు సదరు ముగ్గురు బాలనేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈనెల 11న తాము ఓ వ్యక్తిని హత్య చేశామని వెల్లడించారు. దీంతో ముగ్గురినీ జువైనల్ హోంకు తరలించారు.
పోలీసు వలయంలో మాన్గార్ బస్తీ
Published Wed, Sep 24 2014 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement