పెళ్లి, పండుగల సీజన్ను పురస్కరించుకొని ప్రసిద్ధ ఎక్స్పో బ్రాండ్ ‘ట్రెండ్జ’ అత్యాధునిక ఉత్పత్తుల ప్రదర్శనను తాజ్కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసింది. ఈ ఎక్స్పోను సినీనటి దీక్షాపంత్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ట్రెండ్జ నిర్వాహకురాలు శాంతి కాంతి రావన్ మాట్లాడుతూ ప్రస్తుత పండుగలు, పెళ్లిళ్ల సీజన్కు తగ్గట్టు విభిన్న రకాల డిజైన్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది. - సాక్షి, వీకెండ్ప్రతినిధి