కంకర క్వారీలపై పచ్చదనంపరవళ్లు
సాగర్ వ్యర్థాలతో అద్భుత నందన వనం
హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అద్భుత సృష్టి
సిటీబ్యూరో : హుస్సేన్సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కులో అద్భుత వనాలను ఆవిష్కరించిన హెచ్ఎండీఏ ఇప్పుడు శివారు ప్రాంతాల్లో పచ్చదనాన్ని పరవళ్లు తొక్కించేందుకు సన్నద్ధమైంది. గాజులరామారం సమీపంలోని కంకర క్వారీలను కనుమరుగు చేస్తూ అక్కడ సుందర నందనాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరం లోపలే కాదు...వెలుపల కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పనులకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా వెలికితీసింది. దీన్ని సంజీవయ్య పార్కులోని డంప్సైట్లో ఎండబెట్టి ఇందులో 1.5 లక్షల క్యూబిక్ మీటర్లు వ్యర్థాలను నగర శివారులోని గాజులరామారం వద్ద గల కైసర్నగర్ సమీపంలోని కంకర క్వారీల కు తరలించింది. డంప్ సైట్ క్వారీ నుంచి వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా, పక్కలకు జారిపోకుండా అడుగున, చుట్టూ సైడ్ వాల్కు 90 సెం.మీ.ల మందంతో హెచ్డీపీఈ షీట్ లైనర్ను ఏర్పాటు చే సి జాగ్రత్తలు తీసుకొన్నారు.
సాగర్ పూడిక వ్యర్థాలతో ఇక్కడి క్వారీలను నింపి లెవెల్ చేయడంతో సుమారు 2.5 ఎకరాల మేర మైదానం ఏర్పాటైంది. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేకుండా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అక్కడ ఉద్యానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా పవిత్ర వృక్షాలైన మారేడు, వేప, రాగి, మర్రి, కందంబం, పొగడ, పొన్న, అశోక, చింత, కైజీరియా, రోజ్ వుడ్ రకాలకు చెందిన మొక్కలు నాటి రాతి క్యారీల స్థానే అద్భుత ఉద్యానాన్ని సృష్టించింది. కైసర్నగర్ వాసులు ఊహించని విధంగా అక్కడ ట్రీ పార్కు రూపుదాలుస్తుండటంతో ముక్కున వేలేసుకొంటున్నారు. సాయంత్రం వేళల్లో వాహ్యాళికి వెళ్లేవారికి అనువుగా పార్కులో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కులో భారీగా ఎదిగే వృక్షజాతి మొక్కలతో పాటు పర్యాటకుల మదిని దోచేలా వివిధ రకాల రంగు రంగుల పూలమొక్కలను నాటి సందర్శకులు సేదతీరేందుకు అక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలోని పార్కు చుట్టూ వెదురును పెంచి ట్రీపార్క్కు సరికొత్త రూపును అద్దుతుండటంతో శివారు ప్రాంతంలో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది.
సిటీబ్యూరో : హుస్సేన్సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కులో అద్భుత వనాలను ఆవిష్కరించిన హెచ్ఎండీఏ ఇప్పుడు శివారు ప్రాంతాల్లో పచ్చదనాన్ని పరవళ్లు తొక్కించేందుకు సన్నద్ధమైంది. గాజులరామారం సమీపంలోని కంకర క్వారీలను కనుమరుగు చేస్తూ అక్కడ సుందర నందనాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరం లోపలే కాదు...వెలుపల కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పనులకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా వెలికితీసింది. దీన్ని సంజీవయ్య పార్కులోని డంప్సైట్లో ఎండబెట్టి ఇందులో 1.5 లక్షల క్యూబిక్ మీటర్లు వ్యర్థాలను నగర శివారులోని గాజులరామారం వద్ద గల కైసర్నగర్ సమీపంలోని కంకర క్వారీల కు తరలించింది. డంప్ సైట్ క్వారీ నుంచి వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా, పక్కలకు జారిపోకుండా అడుగున, చుట్టూ సైడ్ వాల్కు 90 సెం.మీ.ల మందంతో హెచ్డీపీఈ షీట్ లైనర్ను ఏర్పాటు చే సి జాగ్రత్తలు తీసుకొన్నారు. సాగర్ పూడిక వ్యర్థాలతో ఇక్కడి క్వారీలను నింపి లెవెల్ చేయడంతో సుమారు 2.5 ఎకరాల మేర మైదానం ఏర్పాటైంది. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేకుండా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అక్కడ ఉద్యానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది.
ప్రధానంగా పవిత్ర వృక్షాలైన మారేడు, వేప, రాగి, మర్రి, కందంబం, పొగడ, పొన్న, అశోక, చింత, కైజీరియా, రోజ్ వుడ్ రకాలకు చెందిన మొక్కలు నాటి రాతి క్యారీల స్థానే అద్భుత ఉద్యానాన్ని సృష్టించింది. కైసర్నగర్ వాసులు ఊహించని విధంగా అక్కడ ట్రీ పార్కు రూపుదాలుస్తుండటంతో ముక్కున వేలేసుకొంటున్నారు. సాయంత్రం వేళల్లో వాహ్యాళికి వెళ్లేవారికి అనువుగా పార్కులో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కులో భారీగా ఎదిగే వృక్షజాతి మొక్కలతో పాటు పర్యాటకుల మదిని దోచేలా వివిధ రకాల రంగు రంగుల పూలమొక్కలను నాటి సందర్శకులు సేదతీరేందుకు అక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలోని పార్కు చుట్టూ వెదురును పెంచి ట్రీపార్క్కు సరికొత్త రూపును అద్దుతుండటంతో శివారు ప్రాంతంలో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది.
నాడు గనులు... నేడు వనాలు !
Published Tue, Feb 23 2016 11:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement