హైదరాబాదీలకు కేటీఆర్ థ్యాంక్స్ | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలకు కేటీఆర్ థ్యాంక్స్

Published Mon, Jul 11 2016 6:11 PM

హైదరాబాదీలకు కేటీఆర్ థ్యాంక్స్ - Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి హైదరాబాదీలు విశేషంగా మద్దతు పలికారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్లో హరితహారంలో భాగంగా 25 లక్షల మొక్కలు నాటాలని పెట్టుకున్న లక్ష్యాన్ని 10 గంటల్లో అధిగమించామని కేటీఆర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

జంటనగరాల్లో ఈ రోజు జరిగిన హరితహారం కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు, టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, అమల, అల్లు అర్జున్, అఖిల్తో పాటు వివిధ రంగాలవారు పాల్గొని మొక్కలు నాటారు. చిన్నారులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement