బడిలో రాజకీయ వేడి
పరీక్ష సమయంలో ఎమ్మెల్సీ పోరు
ప్రచారపర్వంలో ఉపాధ్యాయులు
అయోమయంలో విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పరీక్షల కాలం దరిచేరింది. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పరీక్షలకు ఎన్నికలకు లింకు ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండీ మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే నెల తొమ్మిదిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నిక కాస్తా వార్షిక పరీక్షల వేళ వస్తుండడం.. ఓటర్లంతా ఉపాధ్యాయ, అధ్యాపకవర్గాలు కావడంతో విద్యాసం స్థల్లో రాజకీయ వాతావరణం నెలకుంది. శాసనమండలి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉపాధ్యాయ సంఘాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. కొందరు టీచర్లు ఏదో ఒక యూనియన్కు అనుబంధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో విద్యాబోధనకు తాత్కాలి క విరామం ప్రకటించి మరీ ప్రచారపర్వంలో మునిగిపోతున్నారు. దీంతో వార్షిక పరీక్షల వేళ విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు లేకుండా పోయాయి.
విద్యా బోధనకు ఆటంకం
మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతుండగా.. అదే నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూ ల్ వెలువడడం.. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ఘట్టం జరుగుతుండడంతో బరిలో దిగే అభ్యర్థుల వెంట ఉపాధ్యాయులు పరుగెడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రచారపర్వం ఊపందుకుంటున్న తరు ణంలో ఉపాధ్యాయుల మద్ధతు కూడగట్టే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రతిరోజూ పాఠశాలలను తిరుగుతూ.. సాయంత్రం వేళ మర్యాదపూర్వక భేటీల పేరిట ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాబోధనపై దృష్టి సడలుతోంది. పరీక్షల వేళ విద్యార్థులు ఏకాగ్రత కోల్పోకుండా సిలబస్ను రివిజన్ చేయించాల్సిన మాస్టార్లు..ఇలా కరపత్రాలు పట్టుకొని అభ్యర్థుల వెంట ప్రచారానికి వెలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పదో తరగతి పరీక్షలకు కనీసం నెలరోజుల గడువు కూడా లేదు. 9న పోలింగ్, 15న కౌంటింగ్ జరుగుతుండడం.. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు అదే నెల 20 తేదీవరకు ఉండడం.. ఈ మధ్యలోనే పోలింగ్ జరుగనుండడం విద్యార్థుల వార్షిక పరీక్షల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నాయి. పాఠశాల సమయ వేళల్లో ఎన్నికల ఊసెత్తకుండా... ఆ తర్వాతే తమ మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.
అత్యవసరం ఉంటేనే సెలవులు
త్వరలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థి తుల్లోనే ఉపాధ్యాయులు సెలవులను వాడుకోవాలి. పిల్లల చదువులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాలల సమయం, ప్రత్యేక తరగతుల నిర్వహణపై టీచర్ల ప్రచార ప్రభావం ఏ మాత్రం ఉండకుండా నడుచుకోవాలి. ఒకవేళ ఆన్ డ్యూటీలో ప్రచారం సాగిస్తున్నట్లు గుర్తిస్తే సదరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవు. – కె. సత్యనారాయణ రెడ్డి, డీఈఓ
పరీక్షల వేళ.. ఎన్నికల గోల!
Published Sat, Feb 18 2017 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement