కాంగ్రెస్‌ను వీడను: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడను: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి

Published Thu, Apr 14 2016 4:08 AM

కాంగ్రెస్‌ను వీడను: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి - Sakshi

దేవరకొండ: కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో విలేకరులతో ఆయ న మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఓ వైపు తాగడానికి మంచినీళ్లు లేక ప్రజలు చస్తుంటే.. మందు తాగి చావమన్నట్లుంది ప్రభుత్వం తీరు’ అని  విమర్శించారు.

Advertisement
Advertisement