సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లులో రెండు ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయని.. ఎస్టీల రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ బద్ధమైనది కాగా, ముస్లిం రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైనదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని, తాజా బిల్లు అంశమూ కోర్టుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను పెంచడానికి మద్దతు తెలుపుతున్నామని, ముస్లిం రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకు ముందు బిల్లుపై చర్చలో రామచంద్రరావు మాట్లాడుతూ.. ముస్లింల వెనుకబాటుదనంపై ప్రధాని మోదీ భువనేశ్వర్లో చేసిన వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ తెలివిగా తనను ఇరికించే ప్రయత్నం చేశారని నవ్వుతూ అన్నారు. శివలింగంపై తేలు ఉంటే దాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే కుడుతుందని, అలాగని చెప్పుతో కొట్టలేమని.. ప్రస్తుతం తమ పరిస్థితి ఇలా ఉందంటూ చలోక్తి విసిరారు. రాష్ట్రంలో జనాభా నిష్పత్తిని బట్టి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాల్సిందేనని, అయితే ఈ బిల్లులో ముస్లింలు అనే ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల కేసే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, ఇక పెంచిన 12 శాతానికీ అదే గతి పడుతుందన్నారు.
ఎస్టీ బిల్లుకు మద్దతు,ముస్లిం బిల్లుకు వ్యతిరేకం
Published Mon, Apr 17 2017 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement